మక్తల్ టౌన్, నవంబర్ 28 : సమాజసేవకులు చరిత్ర లో నిలిచిపోతారని, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అ న్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఫూ లే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూ లమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని మార్కెట్ కమి టీ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులం, మతం లేకుండా సమాజం అభివృద్ధి కోసం ఆలోచించాలని పేర్కొన్నారు. ఎ న్ని ఆస్తులు ఉన్న పేరు ఉన్నంత వరకే సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు. సమాజ సేవ చేసే వారిని సమాజం ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ అనిల్, పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు కృ ష్ణ, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఫూలే వర్ధంతి
మహాత్మా జ్యో తిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం తపస్ ఆధ్వర్యంలో లోకపల్లి లక్ష్మమ్మ ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యారంగానికి చేసిన కృషి, త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్ కృష్ణారెడ్డి, సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో…
మండలకేంద్రంలో మ హాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జెడ్పీ హైస్కూల్ ఆవరణలో చిత్రపటానికి ఫూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీ ఎస్పీ మండలాధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జ్యోతిరావు ఫూలేను స్ఫూర్తిగా తీసుకొని నవసమాజ నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు. అందరికీ విద్య అం దించేందుకు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. దే శంలో అక్షరాస్యతను పెంచేందుకు తన భార్యకు అక్షరాలు నేర్పించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేశారని గు ర్తు చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శ్రీనివా స్, ప్రధానకార్యదర్శి అంజి, సభ్యులు అర్జున్, అనిల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బస్టాండ్ చౌరస్తాలో..
మండలకేంద్రంలోని బ స్టాండ్ చౌరస్తాలో స్వేరో సర్కిల్, బీఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నా యకులు రామచందర్, కృష్ణ, సుధాకర్, ఆంజనేయులు, హన్మంతు, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.