నడిగడ్డ నేలపై దూదిపూల పంట దరహాసం కొనసాగుతున్నది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ తెల్లబంగారం మెరుస్తున్నది.
ఇక్కడి నేలలు, వాతావరణం పంటకు అనుకూలంగా ఉండడం.. తక్కువ పెట్టుబడి.. సిరుల దిగుబడి రావడం.. మార్కెట్లో మద్దతు ధర లభిస్తుండ డంతో రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. జోగు ళాంబ గద్వాల జిల్లాలో కమర్షియల్ పత్తి తోపాటు సీడ్ పత్తిని పండిస్తుండడంతో ఎకరాకూ 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 2014లో 1,14,933 ఎకరాల్లో సాగులో ఉండగా.. ఏటేటా పెరుగుతూ గతేడాది 2,22,930 ఎకరాల్లో పంట పండింది. ఈ సీజన్లో 2.15 లక్షల ఎకరాలు సాగయ్యే అవ
కాశం ఉన్నదని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కాగా వానకాలం సీజన్కు ముందుగా మేలోనే బోర్లు, చెరువుల ఆయకట్టు
నీటి ఆధారంగా చాలా వరకు పత్తిని సాగు చేశారు. నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. – గద్వాల, జూలై 10తులు ప్రత్యామ్నాయ పంటలు ఎంత సాగు చేస్తే అంతలాభాలు గడించవచ్చు. అయితే నడిగడ్డలో మాత్రం నేలలు అనుకూలంగా ఉండడంతో ఇక్కడి రైతులు పత్తి సాగుపై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడి.. ఆదాయం ఎక్కువ వస్తుండడంతో ఏటేటా పంట సాగుపై కర్షకులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో కమర్షియల్ పత్తితో పాటు సీడ్ పత్తిని అధికంగా సాగు చేస్తున్నారు.
తెల్ల బంగారం సాగుకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండడంతోపాటు దిగుబడి కూడా బాగానే వస్తుంది. దీంతో సాగు విస్తీర్ణం బాగా పెరుగుతున్నది. పంటకు మద్దతు ధర లభిస్తుండడంతోపాటు వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఎక్కువగా సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో అన్నదాతలు దూదిపూలు పండించి ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో జిల్లాలో వ్యవసాయాన్ని రైతులు సంబురంగా చేస్తున్నారు. వానకాలం ముందుగానే మే నెలలో బోర్లు, చెరువు ఆయకట్టు కింద ఉన్న పొలాల్లో ఈ పంటను సాగు చేయగా.. నేడు వ్యవసాయ క్షేత్రాల్లో పైర్లు కళకళలాడుతున్నాయి. కొందరు రైతులు తొలకరి పలుకరించడంతో పత్తి విత్తనాలు వేశారు. జూన్, జూలైలో విత్తితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ పంటను వర్షాధారంగా విత్తుకోవడానికీ అవకాశం ఉన్నది. జూలై 20 తర్వాత రైతులు పత్తి విత్తితే దిగుబడి తగ్గే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. అయితే ఎక్కువగా మే నెలలోనే విత్తనాలు విత్తుకున్నారు. వర్షాధారంగా పంట సాగు చేసే సమయంలో త్వరగా పూత, కాయ వచ్చే వంగడాలను ఎంచుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లదు. అలాగే సాగు సమయంలో మొక్కల మధ్యదూరం 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉండేలా చూసుకుంటే మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఎకరాకూ 10 నుంచి 15 క్వింటాళ్లు
పత్తి ఎకరాకూ 10 క్వింటాళ్లు మొదలు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ తరుణంలో రైతు పత్తిసాగుకు మొగ్గు చూపుతున్నాడు. దీనికి తోడు పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. 2014 నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలో పండిన పత్తి సాగు వివరాలను పరిశీలిస్తే.. 2014 ఏడాదిలో 1,14,933 ఎకరాలు, 2015లో 1,13,355 ఎకరాలు, 2016లో 1,15,383 ఎకరాలు, 2017లో 1,48,403 ఎకరాలు, 2018లో 1,48,170 ఎకరాలు, 2019లో 1,88,628 ఎకరాలు, 2020లో 2,21,122 ఎకరాలు, 2021లో 1,91,277 ఎకరాలు, 2022లో 2,22,930 ఎకరాలు సాగైంది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. ఈ వానకాలం సీజన్లో 2,15,000 ఎకరాలు పంట సాగయ్యే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
ప్రత్యామ్నాయ పంటలే మేలు
రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రభుత్వంతోపాటు వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకే సిరులు కురిపిస్తున్న పత్తి వైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గతేడాది పత్తి ధర క్వింటాకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు లభించగా.. ఈ ఏడాది పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయలేమని తెగేసి చెప్పడం.. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గింజనూ కొనుగోలు చేసింది. దీంతో మార్కెట్లో మంచి ధర ఉన్న తెల్లబంగారం పంట సాగుచేస్తే మేలని కర్షకులు ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పండిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయడంతోపాటు జిల్లాకు పక్క రాష్ట్రమైనా కర్ణాటకలోని రాయిచూర్లో మంచి ధర ఉండడంతో ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశం లేకపోలేదు.