జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
పెద్దరేవల్లిలో దెబ్బతిన్న ఇండ్లు, పంటల పరిశీలన
14కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం
బాలానగర్, మే 16 : ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్లు, గుడిసెలు, పంటలను సోమవారం మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూలిన ఇండ్లు, గుడిసెల్లోని వారందరికీ డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు రైతువేదిక వద్ద తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, తడిసిన ధాన్యాన్ని రైతులనుంచి కొని వెం టనే మిల్లులకు తరలించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులుతో మాట్లాడుతూ తక్షణమే ఆస్తినష్టం వివరాలను సేకరించి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.
అలాగే భారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ లైన్ల ను పునరుద్ధరించాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వడ్డెరబస్తీ, గాంధీకాలనీ, దళితవాడలో ఎమ్మెల్యే పరిశీలించి ఆస్తినష్టం సంభవించిన 14 కుటుంబాలకు తక్షణ సాయం గా ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున మొత్తం రూ.1, 40,000 ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కమల, వైస్ఎంపీపీ వెంకటాచారి, గిరిజన నాయకుడు లక్ష్మణ్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బా లునాయక్, యూత్వింగ్ మండల అధ్యక్షుడు ప్రకాశ్, రైతు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, ఏఎంసీ డైరెక్టర్ శివానందరెడ్డి, ఎంపీటీసీ లింగూనాయక్, సర్పంచులు రమేశ్నాయక్, గోపినాయక్, తిరుపతినాయక్, నాయకులు శశికాంత్రెడ్డి, పరమేశ్వర్, జగన్నాయక్, శ్రీకాంత్, కా వలి మధు, పాండు, మల్లేశ్, వ్యవసాయ అధికారులు, తదితరులు ఉన్నారు.