10.5 తులాల బంగారు గొలుసులు, రెండు బైకులు స్వాధీనం
డీఎస్పీ కిషన్ వెల్లడి
జడ్చర్లటౌన్, ఏప్రిల్11 : గ్రామీణ ప్రాంతాలు, జాతరలు టార్గెట్గా చేసుకొని రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులను లాక్కెళ్తున్న దొంగల మూఠాను పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. జడ్చర్ల పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కిషన్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరితండాకు చెందిన ముడావత్ పాండు, ముడావత్ సేవ్యా, ముడావత్ శ్రీను, ఎం శ్రీను అనే నలుగురు పాత నేరస్తులు.
వీరందరూ కలసి జడ్చర్ల మండలం గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి జాతరలో రంగులరాట్నం వద్ద ఫిబ్రవరి13న కృష్ణవేణి అనే మహిళ మెడలో నుంచి 2తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్పై పారిపోయారు. మరుసటి రోజు అక్కడే విజయలక్ష్మి అనే మహిళ మెడలో నుంచి 3తులాల బంగారు పుస్తెతాడును ఎత్తుకెళ్లారు. అలాగే జడ్చర్లలోని డబుల్బెడ్రూం ఇండ్ల వద్ద సుప్రజ అనే మహిళ మెడలోనుంచి బంగా రు గొలుసును ఎత్తుకెళ్లారు. అదే విధంగా మండలంలోని ఆలూ ర్ గ్రామంలో పుష్పలత అనే మహిళ మెడ లో నుంచి కూడా బంగారు గొలుసును లాక్కెళ్లారు.
వేర్వే రు దొంగతనాలకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ముడావత్పాండు, ముడావత్ శ్రీను లూనాపై అనుమానాస్పదంగా వస్తుండగా పట్టుకొని విచారించారు. పోలీసుల విచారణలో పట్టుబడ్డ ఇద్దరు నిందితుల వాంగ్మూలం మేరకు ముడావత్ సేవ్యాను పట్టణంలోని ఓ బంగారం దుకాణం వద్ద పట్టుకున్నా రు. నలుగురు నిందితులలో ముగ్గురు నిందితులు పట్టుబడగా ఎం శ్రీను అనే నిందితుడు పరారీలో ఉన్న ట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి మొత్తం పదిన్నర తులాలు బంగారు గొలుసులతోపాటు రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
పట్టుబడ్డ నిందితులపై జడ్చర్ల, తిమ్మాజిపేట, ఖిల్లాఘన్పూర్, పెద్దమందడి, కేశంపేట, కీసర, మహేశ్వరం, పేట్బషీర్బాద్, బొమ్మలాపురం, బీబీనగర్, కందుకూర్ పోలీసుస్టేషన్లలో మొత్తం 29కేసులు ఉన్నట్లు డీ ఎస్పీ తెలిపారు. నిందితుడు ముడావత్పాండుపై ఖిల్లాఘన్పూర్ పోలీసుస్టేషన్లో పీడీయాక్ట్ నమోదైనట్లు చెప్పారు. నలుగురు నిందితులు ఇటీవల జైలుకెళ్లి బెయిల్పై బయటకొచ్చి చైన్స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీ ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో జడ్చర్ల సీఐ రమేశ్బాబు, ఎస్సైలు రాజేందర్నాయక్, ఖాదర్తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.