KTR | మహబూబ్నగర్ ( Mahaboobnagar ) జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి ( Divitipalle ) వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్ను ఈనెలాఖరు నాటికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ ( Srinivas Goud ) వెల్లడించారు. సువిశాలమైన 400 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ ఎనర్జీ పార్కు పనులు తుది దశకు చేరాయన్నారు. మంగళవారం రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ను మంత్రి సందర్శించారు. అక్కడికొచ్చిన వందల మంది డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఐటీ కారిడార్ ఏర్పాటుతో విదేశాల నుంచి కంపెనీలు తరలి రానున్నాయని తెలిపారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని చెప్పారు. ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పట్టణానికి చేరువలో దివిటిపల్లి వద్ద 400కు పైగా ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఐటీ ఎనర్జీ పార్కు పనులు తుది దశకు చేరుకున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ టవర్ను ఈనెలాఖరున ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గు రైన మహబూబ్నగర్ జిల్లాను సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పా రు. 14 లక్షల మంది వలసలు వెళ్లే మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు దివిటిపల్లి వద్ద ఐటీ, ఎనర్జీ పార్కును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 4 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఈ టవర్లో దేశ విదేశాల నుంచి అనేక సాఫ్ట్వేర్ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాన్ని పెంపొందించి స్థానికంగానే ఉద్యోగావకాశాలను కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేస్తున్న ఐటీ ఎనర్జీ పార్కులో రూ.10వేల కోట్ల పెట్టుబడితో 10వేల మందికి ప్రత్యక్షంగా, వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లిథిమం గిగా కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇకపై ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. కాలుష్య కారకమైన పెట్రోలు, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయమైన ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం బ్యాటరీలను అందించే దివిటిపల్లి పరిశ్రమ ప్రపంచంలోనే మూడోదని మంత్రి వివరించారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పరిశ్రమ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రతిపక్షపార్టీకి చెందిన కొందరు దుర్మార్గంగా ఈ పరిశ్రమపై దుష్ఫ్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు.
విదేశాల నుంచి పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకువస్తామని, అమెరికాలో స్థిరపడిన స్థానికులతో త్వరలో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని, వారిని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. త్వరలో జర్మనీలోనూ అక్కడి తెలంగాణ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టేలా ఒప్పిస్తామన్నారు. రాబోయే 3, 4 ఏం డ్లలో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయన్నారు. ఒక్క మహబూబ్నగర్ పట్టణమే కాకుండా ఉమ్మడి జిల్లా అంతా బాగుపడుతుందని చెప్పారు.