నారాయణపేట, అక్టోబర్ 10 : అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాన్ని డీఐజీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఐజీ మాట్లాడారు. నారాయణపేట-కర్ణాటక జిల్లాల సరిహ ద్దు, అంతర్ జిల్లా చెక్పోస్టులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు రవాణా కాకుండా పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద సంబంధిత అధికారుల సమన్వయంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
సోషల్ మీడియలో ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని బైండోవర్ చేయాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం డీపీవో, డీసీఆర్బీ, ఎస్బీ కార్యాలయాల్లో రికార్డులను తనిఖీ చేశారు. సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సీఐలు రవిబాబు, శ్రీకాంత్రెడ్డి, రాంలాల్, జనార్దన్, ఎస్సైలు పాల్గొన్నారు.