మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. శుక్రవారం పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఊరూరా శివనామస్మరణ మార్మోగనున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, ఉమామహేశ్వరం, భౌరాపూర్, అలంపూర్, సోమశిలతోపాటు పలు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయాలు మిరిమిట్లుగొల్పుతున్నాయి. ఉ పవాస దీక్షలతో శివస్వాములు, భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రికి జాగరణ చేసి భక్తిభావాన్ని చాటనున్నారు.
శివ భక్తులకు ఆరాధ్యమైన పండుగ శివరాత్రి. ఏడాదిలో ఎంతో విశిష్టత కలిగిన ఈ రోజున భక్తు లు మహా శివుడికి నియమ నిష్టలు, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇప్పటికే మాలలు ధరించిన శివస్వాములు శివరాత్రి రోజు తమ దీక్షలను విరమించనున్నారు. శివరాత్రి అంటేనే ప్రధానంగా ఉపవా సం, రాత్రి జాగారం.. ఈ రోజంతా భోజనం చే యకుండా.. రాత్రి కూడా నిద్రపోకుండా శివనా మ స్మరణతో పూజలు చేయడం విశిష్టం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పగటిపూ ట ఉపవాసం ఉంటూ అలంకార ప్రియుడైన శివుడికి బేలపత్రం, ధాతుర, పాలు, పండ్లు, స్వీట్లు, ఇతర పదార్థాలతో నైవేద్యం అందిస్తారు. ఈ రోజు న పవిత్ర స్నానం చేసి, శివపార్వతుల ముందు నె య్యితో దీపాలను వెలిగించి పూజలు చేయాలి. నిర్జల, ఫలహార, సమాప్త వ్రతాలను పాటిస్తారు. ఉపవాస సమయంలో నీరు, ఆహారం తీసుకోకుం డా ఉండడం నిర్జల వ్రతం. ఈ వ్రతాన్ని 8వ తేదీ న ఉదయం 12 గంటల నుంచి మార్చి 9న సూ ర్యోదయం వరకు ఉంటుంది. ఫలహార వ్రతంలో భాగంగా నీళ్లు, చాయ్, కొబ్బరినీళ్లు, కాఫీ, ఫ్రూట్ జ్యూస్, లస్సీ, డ్రైఫ్రూట్స్లాంటివి ఉప్పు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సమాప్తంలో భాగం గా ముఖానా ఖీర్, రైస్ ఖీర్, బెల్లం ఖీర్, సూజీ హల్వాలాంటివి తింటారు. చీకటి, అజ్ఞానాన్ని అధిగమించడాన్ని జాగారం సూచిస్తుంది. ఉపవా స దీక్షతో శరీరం తేలిక పడుతుంది. చంచలత్వంతగ్గి, మనస్సు మరింత ప్రశాంతత పొందుతుంది. కోపం, దురాశ, ఆందోళన, కామం వంటి భావోద్వేగాలను ఈ ఉపవాస దీక్ష నియంత్రిస్తుందని భక్తుల నమ్మకం.
శివరాత్రి పండుగ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం, ఉమామహేశ్వరం, భౌరాపూర్తోపాటు పలు ఆలయాల్లో ప్రత్యేకంగా శివపార్వతు ల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా ఆలయాలను ముస్తాబు చేశారు. భౌ రాపూర్లో చెంచులే పూజారులుగా ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ ప్రతినిధిగా కల్యాణం నిర్వహించనున్నా రు. కాగా, శ్రీశైలానికి కాలినడకన వేలాది మంది భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ చేరుకున్నారు. శ్రీశైలంలో శుక్రవారం నిర్వహించే పాగదర్శనం ఎంతో విశిష్టంగా భావించి భక్తులు పెద్ద ఎ త్తున చేరుకుంటున్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా అన్ని డిపోల నుంచి నడిపిస్తున్నారు. ఇలా ఒక్క రోజు ఉపవాసం, జాగర ణ చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు.
మదనాపురం, మార్చి 7 : మహాశివరాత్రిని పురస్కరించుకొని మదనాపురం, కొ త్తకోట మండలాల్లోని ఆలయాలు సర్వాం గ సుందరంగా ముస్తాబయ్యాయి. పామాపురం ఆలయంలో శుక్రవారం రాత్రి 7 గం టలకు శివపార్వతుల కల్యాణం, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారి రథోత్స వం నిర్వహించనున్నారు. అదేవిధంగా కో టి లింగేశ్వర ఆలయంలో పంచామృతాభిషేకాలు, సంకీర్తన ఆలాపన, రాత్రి 7 గంటలకు శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ సమయంలో ప్రత్యేక అభిషేకాలు, తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మూసాపేట(అడ్డాకుల), మార్చి 7 : భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. స్వయంభూ లింగ రూపంలో వెలిశాడు కందూరు రామలింగేశ్వరుడు. ఇ క్కడ వెలిసిన స్వామి వారికి పాణపట్టం లే దు. శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద పూజలు, హోమాలు చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. తాగునీటితోపాటు పార్కింగ్ వసతి కల్పించారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈవో రామేశ్వరశర్మ గు రువారం ఏర్పాట్లను పరిశీలించారు.