వెల్దండ, అక్టోబర్ 17: బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది వందశాతం పూర్తి చేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో లబ్ధి పొందిన వారు ఉన్నారన్నారు. ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకురాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 13లక్షల మంది ఆడపడుచులకు కల్యాణలక్ష్మి కానుకగా అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రజలాంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ప్రతి పక్షాలు పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. నేడు వెల్దండ ఏవీఆర్ఎస్ ఫంక్షన్హల్లో నిర్వహించే బీఆర్ఎస్ మండలస్థాయి విసృత స్థాయి సమావేశానికి మండంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, సర్పంచులు వెంకటేశ్వర్రావు, గోరటి శ్రీను, అంజయ్య, మాజీ ఎంపీటీసీ కడారి కృష్ణయ్య, బాలేమియా, దేవేందర్, ప్రసాద్తోపాటు బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.