బిజినేపల్లి, మే 6: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం సమీపంలో ఏ ర్పాటు చేస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని వట్టెం గ్రామంలో వెంకటాద్రి రిజర్వాయర్ పనులను సీ ఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఎంపీ రాములు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పదిశాతం పనులు మూడునెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. ప్యాకేజీ నెంబర్ 12 వద్ద మిషన్ భగీరథ కెనాల్ పనులను పరిశీలించి కెనాల్కు హైడ్రాలిక్ గేజ్తో గేట్ల ఏర్పాటుకు చర్యలు తీ సుకోవాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించా రు. కార్యక్రమంలో ఇ రిగేషన్ అధికారులు మురళీధర్రావు, సలహాదారుడు పెంటారె డ్డి, సీఈ అమీద్ఖాన్, ఎస్ఈ విజయభాస్కర్రెడ్డి, ఈఈ పార్థసార ధి, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో నా గలక్ష్మి, తాసీల్దార్ అం జిరెడ్డి ఉన్నారు.