మహబూబ్నగర్ అర్బన్, జూలై 26 : అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్-2 ఇంటిగ్రేటర్స్ పాలమూరు ఐటీ టవర్లో బ్రాంచ్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు శ్రీకాంత్ లింగిడి, శ్రీనివాస్ సంతాన.. బు ధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మహబూబ్నగర్లో వంద మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలను కల్పించేలా పరిశ్రమను త్వరలో నెలకొల్పుతామన్నారు. అర్హత ఉన్న స్థానిక యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యతనిస్తామన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే కనీసం తాగునీటికి కూడా 14 రోజులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలమూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వలస జిల్లాకు సాఫ్ట్వేర్ కంపెనీలు తరలివస్తున్నాయన్నారు. ఇప్పటికే రూ.10వేల కోట్ల పెట్టబడులతో అమర్రాజా లిథియం గిగా పరిశ్రమ ఏర్పాటు కానున్నదని, అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ నెలకొల్పుతామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఎస్-2 ఇంటిగ్రేటర్స్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ లింగిడి మాట్లాడుతూ దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ టవర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండడంతోపా టు జాతీయ రహదారులు, స్థానికంగా సౌకర్యాలు అ ద్భుతంగా ఉన్నాయని అందుకే తమ కంపెనీని ఇక్కడ నెలకొల్పేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అమెరికాకు చెందిన అనేక సాఫ్ట్వేర్ పరిశ్రమలు మహబూబ్నగర్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం కంపె నీ ప్రతినిధులను మంత్రి సన్మానించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నరేందర్రెడ్డి, అబ్రహం, బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.