ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండని పరిస్థితి.. ట్యాంకులో ఉన్న కొద్దిపాటి నీటిని వదిలితే ఒక్క వార్డుకు కూడా సరిపోయేవి కావు. దీంతో గ్రామాల్లో నల్లా నీటి కోసం గంటల తరబడి వేచిచూసేవారు. ఉదయం పూట మహిళలు తాగునీటి బిందెలతో సిగపట్లు పట్టుకునేవారు. అయినా నీళ్లు సరిపోక
వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్తే రైతులు రానిచ్చేవారు కాదు. గ్రామస్తులకు వదిలే బిందెడు నీటితో నాలుగు దంట్లు అయినా తడుస్తాయన్న ఆశ రైతులకు ఉండేది. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి ఇలా ఎన్నో పోరాటాలు చేసేవారు.
నేడు స్వరాష్ట్రంలో క‘న్నీటి’ గోసలు తీరాయి. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందెలతో కుస్తీలు పట్టొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అపర భగీరథుడిగా మారి లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేశారు. ఎక్కడికక్కడ జలశుద్ధి కేంద్రా లను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట గ్రామాల్లో ఓవర్హెడ్ వాటర్ట్యాంకులు నిర్మించారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కూర్చున్న చోటే ఫిల్టర్ చేసిన నీళ్లు అందుతున్నాయి. దీంతో మహిళలు
హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మూసాపేట, ఏప్రిల్ 28
గొంతు తడుపుకొనేందుకు అవసరమైన నీటికోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. పల్లెల్లో అయితే నీటికోసం కుస్తీలు కూడా పట్టేవారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెల్వదు.. మోటర్ ఎప్పుడు మొరాయిస్తుందో తెల్వదు.. వేసవి వస్తే చా లు భూగర్భ జలాలు ఇంకిపోయి నీరు రాక నానా అవస్థలు.. ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేసినా బిందెలతో మహిళలు కుస్తీ పడేవారు. పాలమూరు మీదుగా కృష్ణమ్మ పరుగెడుతు న్నా.. తాగునీటికి జిల్లా నోచుకోని దయనీయ పరిస్థితులు ఎ న్నో.. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎనిమిదేండ్ల ముందుమాటే..
తెలంగాణ ఏర్పాటుకు ముందు పాలమూరు జిల్లా పరిస్థితి అ ధ్వానంగా ఉండేది. కృష్ణా జలాలు జిల్లా మీదుగా ఆంధ్రకు వెళ్తు న్నా ఇక్కడ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. పట్టణాల్లో నాలు గు నుంచి వారానికోసారి నల్లా నీళ్లు వచ్చేవి. పల్లెల పరిస్థితి మరి దారుణంగా ఉండేది. వేసవి వస్తే చాలు బోర్లలో నీళ్లు లేక.. కరెం టు కోతలు, కరెంటు ఉన్నా బోర్ల నుంచి నీరు ట్యాంక్కు ఎక్కిస్తే అవి ఒక వీధికి కూడా సరిపోయేవి కావు. నల్లా నీళ్ల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా ఇంటికి ఒకరో, ఇద్దరి చొప్పున గంటల తరబడి వేచి చూడాల్సిందే.. కొన్ని కు టుంబాల విద్యార్థులు నీటి కోసం స్కూళ్లు, కా లేజీలకు డుమ్మా కొట్టేవారు. ఏ సందులో చూ సినా మహిళలు బిందెల తో కుస్తీలు పడుతూ.. పంచాయతీలు పెట్టుకునే సన్నివేశాలే కనిపించేవి. వ్యవసాయ పొలాల వెంట మహిళలు, యువకులు, చి న్నారులు బిందెలు పట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చేది. తాగునీటి కొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ఖాళీ బిం దెలతో ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి.. ఇలా గొంతు తడవడానికి చేయని పోరాటాలు లేవు. ఉమ్మడిరాష్ట్రంలో దినపత్రికల్లో ఏదో ఒక చోట తాగునీటి కష్టాల వార్తలు కనిపించేవి.
ఉద్యమ సమయంలో పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్కు వ చ్చిన నిధులు గ్రామాల్లో తాగునీటి బోర్లు వేసేందుకు సరిపోయేవి కావు. అప్పటి జిల్లాలోని ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలా గే ఉండేది. ఈ యేడు వేసిన బోర్లు వచ్చే ఏడాదికి అడుగం టిపోయేవి. దీంతో కొత్తగా బోరు వేయక తప్పని పరిస్థితి. నాటి ఎంతోమంది సర్పంచులు తాగునీటి కోసం నిద్ర లేని రాత్రుళ్లు గడిపారు. పాలమూరు ప్రజల తాగునీటి కష్టాలు కండ్లారా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉందని తెలుసుకున్నారు. మహిళలు పడుతున్న కష్టాలను ఎలాగైనా తీర్చాలనే సంకల్పంతో ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. 2016, ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభమ య్యాయి. రూ.42వేల కోట్లతో రాష్ట్రంలో 1.30 లక్షల కిలోమీటర్ల పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ జలశుద్ధి కేంద్రాలను నిర్మించి అవసరమైన గ్రామాల్లో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. దీంతో 2019 నుంచి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా శుద్ధజలం అందించడం ప్రారంభించారు.
నాటి తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. ఉద్యమ సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆల టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండె. ఆయన వెంట ఏ గ్రామానికి వెళ్లినా మొదట తాగునీటి సమస్యే ప్రజలు చెప్పుకునేవారు. ఆల అప్పటి ఎంపీ కేసీఆర్ వద్దకు వెళ్లి తాగునీటి ఇబ్బందులను వివరించే వాడు. ప్రధానంగా ఏ గ్రామంలో ఎక్కువ ఇబ్బంది ఉందో తెలుసుకొని బోరు వేసేందుకు నిధులు మంజూరు చేసేవారు. ఆ బోరు డ్రిల్ చేస్తే నీళ్లు వస్తాయనే నమ్మకం కూడా ఉండేది కాదు. అలాంటి దుర్భర పరిస్థితుల నుంచి మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ తాగునీటికష్టాలను తీర్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాగునీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజాలపూర్ గ్రా మంలో నేను సర్పంచ్గా గెలిచినప్పుడు తాగునీటికి ఇబ్బంది ఉండే ది. దీంతో వాగులో చేతిపంపు బోర్లు వేయించాను. ట్రాక్టర్కు ట్యాంకర్ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించా. ఆ ట్యాంకర్తో గ్రామంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇంటింటికీ నీళ్లు సరఫరా చేశాం. గ్రామస్తుల తాగునీటి కష్టాలను తీర్చడాకి ఆ రోజుల్లో పడని కష్టం అంటూ లేదు. తాగునీటి కష్టాలను తీర్చి సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు.
– గడ్డమీది ఇంద్రయ్యసాగర్, జెడ్పీటీసీ, మూసాపేట
నాడు ఒక వైపు తెలంగాణ ఉద్యమమైతే.. మరో వైపు తాగునీటి కోసం ఉద్యమం ఉండేది. అప్పటి ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోని పరిస్థితి.. సర్పంచులు సైతం చా లా కష్టాలు పడేవారు. వర్షాలతో వచ్చిన వరద కూడా ఆంధ్రాకే తరలే ది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడేవారు. వారి కష్టాలను చూసి చలించి పోయేవా ణ్ణి. ఉన్న నిధులతో కొన్ని గ్రామాలకు తా త్కాలికంగా సమస్య తీర్చేవాణ్ణి. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ప్రారంభించి ఇంటికో నల్ల ద్వారా తాగునీటికి పరిష్కారం చూపిస్తాడని.. నేనే కాదు రాష్ట్రంతోపాటు దే శంలో ఎవరూ అస్సలు ఊ హించలేదు. సీఎం కేసీఆర్ ఆలోచనలు ఎవరి ఊహకు అందని విధంగానే ఉంటాయనడానికి ఇదో చక్కటి ఉ దాహరణ. తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న కేసీఆర్కు ప్రతి కుటుంబం అండగా నిలబడితే రా ష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజ లు ఓటు వేయడానికి ఒక్కరోజు మందు గతాన్ని గుర్తు చేసుకోవాలని కోరుతున్నా..
– ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర
అప్పడైతే నీళ్లకు చాలా ఇబ్బంది ఉండేది. ఓ పూటకు బువ్వ లేకుంటే పెట్టెటోళ్లు కానీ చెంబు నీళ్లు మాత్రం ఇచ్చెటోళ్లు కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ వల్ల ఇంటింటికీ నల్లా అయ్యింది. రోజూ ఇంటికాన్నే నీళ్లు పట్టుకుంటున్నం. దీంతో తాగునీళ్ల పరేషాన్ పోయింది. ఇంత చేసిన కేసీఆర్ సార్ సల్లగుండాలె..
– గొల్ల భీరమ్మ, నిజాలాపూర్ గ్రామం, మూసాపేట మండలం