నెట్వర్క్ నమస్తే తెలంగాణ, మార్చి 18;స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. పల్లె, పట్నంతేడా లేకుండా ప్రగతిపథంలో నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల చెంతకే పాలన అందిస్తున్నారు. దీంతో నూతన జిల్లాల్లో రూ.వందల కోట్లతో పనులు చేపట్టడంతో నవశకం మొదలైంది. ప్రతి గ్రామానికి బీటీ, సీసీ రోడ్లు, మున్సిపాలిటీల్లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ రహదారుల విస్తరణతో సొబగులు సంతరించుకున్నాయి. పల్లె నుంచి పట్నం దాకా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఎంజీకేఎల్, జూరాల, భీమా, పాలమూరు, నారాయణపేటలో కోయిల్సాగర్, గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల, ఆర్డీఎస్తోబీడు భూముల్లో సైతం సాగునీరు పారుతున్నది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు.సబ్బండ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉన్నదనే భరోసానిస్తున్నది.
కల్వకుర్తికి నవశకం..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్వకుర్తి నియోజకవర్గంలో నవశకం ఆరంభమైంది. సాగు జలాలు వ చ్చిన క్రమంలో వ్యవసాయ, అ నుబంధ పరిశ్రమల్లో ప్రగతి నిత్యకృత్యంగా మారిం ది. రియల్ ఎస్టేట్ రం గం ఊహించని వి ధంగా ఊపందుకున్నది. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. కల్వకుర్తి వాసులకు సాగునీరందించాలనే క్రమంలో ఎంజీకేఎల్ఐ కోసం దాదా పు నాలుగు దశాబ్దాల కిందట గత పాలకులు శిలాఫలకం వేసి మరిచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పనుల్లో వేగం పెరిగింది. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేశారు. 2017 నవంబర్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ బీడు భూములను ముద్దాడాయి. గుడిపల్లి గట్టు నుంచి ప్రారంభమైన కేఎల్ఐ 29వ ప్యాకేజీ కా ల్వ కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లిలో 160 కిలోమీటర్ల వద్ద ముగిసింది. ఈ కాల్వ ద్వారా కల్వకుర్తి మండలంలో 37 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. నియోజకవర్గంలోని వెల్దం డ, ఆమనగల్లు, మాడ్గుల మండలాలకు సాగునీరివ్వాలన్న స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మే రకు.. సీఎం కేసీఆర్ డీ-82 కాల్వకు పరిపాలన అనుమతులిచ్చారు. దాదాపు రూ.180 కోట్లతో 58 కిలోమీటర్ల మేర చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. 29వ ప్యాకేజీ, డీ-82 కాల్వతో నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరందుతుంది.
కల్వకుర్తిలోని ఏడు మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది. రెండు కొత్త మండలాలను ఏర్పాటుచేసి కల్వకుర్తిని ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా మార్చింది. కల్వకుర్తి, వెల్దండలో సీఐ కార్యాలయాలు, కల్వకుర్తి, వెల్దండ, చారకొండ, ఊర్కొండ, వంగూర్ మండలాలతో కూడిన డీఎస్పీ కార్యాలయం కల్వకుర్తిలో ఏర్పాటైంది. గతేడాది వెల్దండ మండల కేంద్రంలో ఏవకల్య గురుకులం, ఈ సారి బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటైంది. అలాగే బీసీ బాలికల పాఠశాల, కళాశాల, బీసీ బాలుర పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ బాలికల, బాలుర గురుకుల పాఠశాలలతోపాటు కొత్తగా మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఏర్పాటైంది. నియోజకవర్గం మీదుగా మూడు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారి (ఎన్హెచ్ 365), కోడాద- జడ్చర్ల రహదారి, కొట్ర నుంచి నంద్యాల (167కే) మూడు రహదారులు ఉన్నాయి. 167కే పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, హైదరాబాద్- శ్రీశైలం, కోదాడ-జడ్చర్ల పనులు పూర్తయ్యాయి.
కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీయూఎఫ్ఐడీసీ నిధులు దాదాపు రూ.50 కో ట్లతో పార్కులు, సీసీ రోడ్లు పూర్తి చేశారు. కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యా యి. కల్వకుర్తి మున్సిపాలిటీలో రూ.2 కోట్లతో కొత్త భవనం ఏర్పాటు చేశారు.
ప్రథమ స్థానంలో వనపర్తి!
వనపర్తి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. సమైక్య పాలనలో మరుగునపడిన వనపర్తిని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు ముందడుగేస్తున్నారు. నూతన జిల్లాలు ఏ ర్పాటయ్యాక పెబ్బేరు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మార్చారు. నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉండడంతో పెబ్బేరు మున్సిపాలిటీ సైతం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నది. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో గడిచిన మూడున్నరేండ్ల కాలంలో దాదాపు రూ.44 కోట్లతో అభివృద్ధి పను లు చేపట్టారు. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో రైతు వేదికలను నిర్మించారు. వనపర్తి జిల్లా కేంద్రం, పాన్గల్ మండల కేంద్రంలో మంత్రి ని రంజన్రెడ్డి తన సొంత ఖర్చులతో తల్లిదండ్రుల స్మారకార్థం రైతువేదికలను ఏర్పాటు చేశారు. పంటల ను నిల్వ చేసుకునేందుకు మండలానికి రెండు గోదాంల చొప్పున నిర్మించా రు. గణపసముద్రాన్ని రూ.55 కోట్లు, బుద్ధా చెరువును రూ.42.2 కోట్లతో రిజర్వాయర్లుగా మార్చేందుకు నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఖిల్లాఘణపురం మండలంలోని కర్ణెతండాలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేశారు. శిథిలావస్థకు చే రుకున్న గ్రామపంచాయతీ భవనాలను రూ. 20 లక్షల చొప్పున కొత్తవాటిని నిర్మిస్తున్నారు. సర్పంచ్, కార్యదర్శులకు ప్ర త్యేక గదులు, సమావేశాల నిర్వహణకు వీలుగా హాల్ ఏర్పాటు చే స్తున్నారు. మండలాలు, గ్రా మాలకు కనెక్టివిటీ పెరిగేలా బీటీ రోడ్లను నిర్మిసున్నారు.
అగ్రగామిగా నిలుస్తున్న పేట
నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. నారాయణపేట జిల్లాగా ఏర్పాటయ్యాక నియోజకవర్గానికి రూ.కోట్లల్లో నిధులు మంజూరవుతున్నాయి. దీంతో విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నది. జిల్లా కేంద్రంలో ఆధునిక వసతులతో పిల్లల దవాఖాన ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల ప్రభుత్వపరం కావడంతో విద్యార్థులకు దూరప్రాంతాలకు వెళ్లే బాధ తప్పింది. అన్ని గ్రామాల్లో రైతువేదికలు, క్రీడాప్రాంగణాలు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతివనాలు ఏర్పాటయ్యాయి. మార్కెట్ యార్డుల పరిధిలో గోదాంలను ఏర్పాటు చేయడంతో ధాన్యం నిల్వకు ఇబ్బందులు తీరాయి. బీటీ రోడ్ల ఏర్పాటుతో పల్లెలకు మహర్దశ చేకూరింది. రూ.28.50 కోట్లతో సత్యనారాయణ చౌరస్తా నుంచి సుభాష్ రోడ్డు వరకు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు మధ్యలో డివైడర్, మొక్కలు, బటర్ ఫ్లై లైట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం రూ.3.65 కోట్లతో అంబేద్కర్ చౌరస్తా నుంచి వీరసావర్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
రూ.90 లక్షలతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. ఎక్లాస్పూర్ వద్ద ఎకో పార్క్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పట్టణంలో రూ.6 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. రూ.47 లక్షలతో సఖీ సెంటర్ భ వనం, రూ.4 కోట్లతో కొండారెడ్డి పల్లి మినీ ట్యాంక్బండ్, రూ.80 ల క్షలతో సీనియర్ సిటిజన్ పార్క్ నిర్మించారు.పట్టణ శివారులో రూ. 60.10 కోట్లతో కలెక్టరేట్, రూ.38.50 కోట్లతో పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ.కోటితో సేవాలాల్ భవనం ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా.. ఇటీవలే శంకుస్థాపనలు జరిగాయి. రూ. 56 కోట్లతో అప్పక్పల్లి నుంచి కోయిల్కొండ వరకు డ బుల్రోడ్డు, రూ.2.90 కోట్లతో నారాయణపేట రూ రల్ పోలీస్ స్టేషన్, రూ.కోటితో దోభీఘాట్, ధ న్వాడ మండలకేంద్రంలో రూ.2.90 కోట్లతో పోలీస్స్టేషన్, రూ.1.75 కోట్లతో తాసిల్దార్ కాంప్లెక్స్, మరికల్ మండలకేంద్రంలో రూ.7 కోట్లతో మండల కాంప్లెక్స్ భ వన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
16 టీఎంసీలతో ఉదండాపూర్
అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, నవాబ్పేట, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్ మండలాల్లో వే గంగా పనులు జరుగుతున్నాయి. పక్కా ప్రణాళికతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముందుళ్తున్నారు. రూ.వందల కోట్లతో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామం వద్ద 16 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇందుకుగానూ 17 కిలోమీటర్ల మేర బండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. రూ.100 కోట్లతో మిషన్ కాకతీయ కింద చెరువులకు మరమ్మతులు చేపట్టడంతోపాటు కాల్వలను నిర్మించారు. దీంతో భూగర్భజలాలు పెరిగాయి. రూ.640కోట్లతో 32 రైతువేదికలను ఏర్పాటు చేశారు. రైతుబంధు సమితుల ద్వారా రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అందుతున్నది. ఏ ఈవోలను నియమించడంతో రై తులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
దాదాపు రూ.100కోట్లతో జడ్చర్ల మున్సిపాలిటీలో సీసీ, బీటీ రోడ్లు, రహదారుల విస్తరణ, డ్రైనేజీలు, పార్కులు, పెద్దగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. నల్ల చెరువును రూ.4 కోట్లు, మరో రూ.2కోట్లతో నల్లకుంటను మినీట్యాం క్ బండ్గా తీర్చిదిద్దారు. అలాగే అక్కడ బతుకమ్మ, వినాయకఘాట్, బోటింగ్, పార్కులు ఏర్పాటు చే శారు. మన ఊరు-మన బడి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. రూ.250-300 కోట్లతో గ్రామాల్లో బీటీ, సీసీరోడ్లు వేశారు. ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించారు. గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేశారు. దుందుభి వాగుపై రూ.20-30కోట్లతో చెక్డ్యాంలను నిర్మించారు. మి షన్భగీరథ ద్వారా గ్రామాల్లో రూ.109 కోట్లు, జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.60కోట్లతో ఇంటింటికీ నల్లాలను బిగించారు. దాదాపు 180 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేశారు. మిడ్జిల్ మండలానికి ఎం జీకేఎల్ఐ కాల్వల ద్వారా నీరు అందుతుడడంతో పంటల సాగు పెరిగింది.
రూ.4 వేల కోట్లతో పనులు..
మహబూబ్నగర్ నియోజకవర్గంలో రూ.4 వేల కోట్లతో అభివృ ద్ధి పనులు చేపట్టారు. తరతరాలుగా తలుచుకునే లా మంత్రి శ్రీనివాస్గౌడ్ దగ్గరుండి పనులను చేపడుతున్నారు. మహబూబ్నగర్ నలుదిక్కులా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణం తుది దశలో ఉన్న ది. 400 ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటు చేయడంతోపాటు అమర్రాజా కంపెనీ రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ కంపెనీ ఏర్పాటైతే 10 వేల మం దికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. డబుల్బెడ్రూం ఇండ్ల విషయంలో రాష్ట్రంలో మహబూబ్నగర్ మూడో స్థానంలో ఉన్నది. ఇప్పటికే 3,563 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూ ర్తి చేశారు. 1,459 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. తిరుమల హిల్స్ వద్ద రూ.150 కోట్లతో మెడికల్ కళాశాలను నిర్మించారు. సకల హంగులతో నూతన కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. రూ.500 కోట్లతో సూపర్స్పెషాలిటీ దవాఖానను నిర్మించనున్నారు. రూ.38 కోట్లతో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 3.86 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందనున్నది. జిల్లా కేంద్రంలోని ప్ర ధాన చౌరస్తాల ఆధునీకరణ, రోడ్డు విస్తరణ, పా ర్కుల ఏర్పాటుతో మహబూబ్నగర్ రూపురేఖలు మారుతున్నాయి. మినీట్యాంక్బండ్, శిల్పారామా న్ని ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నారు.
ఆదర్శంగా అచ్చంపేట
వలసలు, వెనుకబాటుకు గు రైన అచ్చంపేట ప్రాంతం ఆదర్శంగా నిలుస్తున్నది. రూ. వేలాది కోట్ల నిధులతో అభివృద్ధికి బాటలు పడుతున్నా యి. గతంలో కరువు నేలగా ఉన్న ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగునీరందుతున్నది. సీఎం కేసీఆర్ హయాం లో పల్లెపల్లెనా అభివృద్ధి ఫలాలు అంతున్నాయి. తెలంగా ణ వచ్చాక జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నది. విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనుల్లో కొన్ని…..? నియోజకవర్గంలో రూ.103 కోట్లతో మిషన్ కాకతీయ కింద 512 చెరువుల పునరుద్ధరణ.
ప్రగతి పరుగులు
స్వరాష్ట్రంలో దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికిగానూ ప్రభుత్వం వి విధ పథకాలు, ప్రాజెక్టులు, ఆయా పనుల కోసం 2022 సెప్టెంబర్ వరకు రూ.5,311 కోట్లు వెచ్చించినట్లు అధికారుల అంచనా. సీఎం కేసీఆర్, ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాగునీటి కష్టాలను తీర్చేందుకు పాలమూరు ఎత్తిపోతలలో భాగంగా కరివెన రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో కొన్ని..
అభివృద్ధికి అందలం
నాగర్కర్నూల్ నియోజకవర్గం.. అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎనిమిదేండ్ల కాలంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశారు. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో విలీనమైన నాలుగు గ్రామాల్లో సైతం అభివృద్ధి పరుగులు పెడుతున్నది. జిల్లాగా ఏర్పాటుకావడంతో పనుల్లో వేగం పెరిగింది. అన్ని మండలాల్లోనూ సమానాభివృద్ధి జరుగుతున్నది.