ఊట్కూర్, జూలై 18 : కృష్ణాతీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు, కృష్ణ మండలాల్లో దందా జోరందుకున్నా.. అటువైపు పోలీసులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉ న్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా నదిని కొల్లగొడు తూ వందల టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నా రు. ప్రభుత్వ అనుమతుల పేరిట ఆన్లైన్ ఇసుక రవాణాను ‘అక్రమ రవాణా’గా మార్చి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. కృష్ణ మండలం వాసునగర్ శివారులోని నదిలో హిటాచీలను రంగంలోకి దించి భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కృష్ణ మండలం వాసునగర్ సమీపంలో కృష్ణానదిలో ఇసుక అక్రమ రవాణాను కవరేజీ చేయడానికి వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ మాగనూరు విలేకరి రాము, జిల్లా ఫొటోగ్రాఫర్ తాహేర్అలీపై ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం కృష్ణానది ను ంచి ఇసుక తరలిపోతుంటే చిత్రీకరిస్తుండగా మాఫియా అడ్డుకొని ఇద్దరిపై దాడికి పాల్పడింది. విలేకరి కడుపులో పిడిగుద్దులు గుద్దడంతో మూగ దెబ్బలు తగిలాయి. భౌతిక దాడులకు పాల్పడడంతోపాటు నది వద్దకు వస్తే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
గాయపడిన జర్నలిస్టులు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో గూడెబల్లూరుకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత వాకిటి నారాయణతోపాటు ఆయన అనుచరులు ఉన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఇద్దరిని మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి పాలమూరు జనరల్ దవాఖానకు తరలించారు. నిత్యం వందలాది టిప్పర్లతో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నా అధికారులు స్పం దించకపోవడం వెనుక రాజకీయ అండదండలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
కృష్ణానది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నదని న్యూస్ కవరేజీకి వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ మాగనూరు రిపోర్టర్ రాము, ఫొటోగ్రాఫర్ తాహేర్పై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఎస్పీ వినీత్, మక్తల్ సీఐ రామ్లాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.