కాంగ్రెస్ నాయకులు రోజుకో తీరున మాట్లాడుతున్నారు. అప్పుడే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, మూడు గంటలిస్తే చాలని, ఈ సమయంలో 10 హెచ్పీ మోటర్లతో సాగునీరు పారించవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరోవైపు ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుంటే జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రే వంత్కు ఓటుతో బుద్ధి చెబుతామని అ ల్టిమేటం జారీ చేశారు. బీఆర్ఎస్ ప్ర భుత్వం తమకు అండగా నిలిచిందని, మరోసారి ఆ పార్టీనే ఆదరిస్తామని ఉమ్మడి జిల్లాలోని కర్షకులు ముక్తకంఠంతో మద్దతు పలుకుతున్నారు.
ధరణి రాకముందు భూములకు సంబంధించిన రికార్డులన్నీ తిక్క తిక్క ఉండేవి. చేసుకునేటోడు ఒక్కడయితే.. రికార్డుల్లో పట్టాదారు ఇంకొక్కడు ఉంటాడు. కబ్జాలో వేరేవాడు ఉంటాడు. ఆఫీసులో వీఆర్వో ట్రాన్స్ఫర్ అయితే చాలు కబ్జా కాలంలో పేర్లు మారిపోతుండె. పాసు పుస్తకంలో కూడా భూమి ఎక్కువ, తక్కువగా మారిపోతుండె. పాలోల్లతోటి, పక్క పొలం వాల్లతోటి ఎప్పుడూ ఇవే పీకులాటలు ఉండటం వల్ల చాలామంది రైతులు పోలీస్స్టేషన్లో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ మొత్తం అధికారాలు తాసీల్దార్కే ఇచ్చిండు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోకుండా ఇప్పుడు తాసీల్దార్ ఆఫీసులనే పని అయిపోతుంది. భూముల రిజిస్ట్రేషన్ మొత్తం తాసీల్దార్ ఆఫీసులనే పెట్టించుండు. ఆన్లైన్తో పదే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తైయిపోతుంది. ఒక్క వేలిముద్ర పెడితే చాలు మన పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఈ పోర్టల్తో ఎలాంటి భూమి సమస్యలున్నా..
ఆన్లైన్లో భూమి భద్రంగా ఉంటది. అలాంటిది కాంగ్రెస్సోళ్లు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామనడం, రద్దుచేస్తామనడం సరికాదు. రైతులకు మంచి చేయకపోయినా ఫర్వాలేదు కానీ మంచి చేసే ధరణిని తీసేస్తాననడం అస్సలు మంచిదికా దు. రైతులకు మంచి జరిగితే కాంగ్రెస్సోళ్లు ఓర్వలేకపో తున్నారు. మళ్లీ దళారుల రా జ్యం తీసుకొచ్చేం దుకే ధరణిని తీసేస్తా మంటు న్నారు. కౌలు దారు కాలం పెడతా మంటున్నారు. ధర ణిని తీసేస్తే భూమి సమ స్యలు పెరిగి ఊర్లల్ల పంచా యితీలు ఎక్కువైతాయి. కోర్టుల్లోనూ ఇవే పంచాయి తీలు ఉంటాయి. కౌలుదా రు కాలం పెడితే భూమి యజమానికి కష్టాలు తప్పవు. కట్టె విరగొద్దు.. పాము సావొద్దు అన్నట్లు కోర్టుల పంచాయితీలు నడుస్తాయి. రైతులు సచ్చే వరకు కూడా సమస్యలు తీరక ఇబ్బందులు పడతారు. ఇలాంటి భూమి సమస్యలు లేకుండా రైతులందరూ సంతోషంగా గడపాలంటే మల్ల కేసీఆర్ సారే సీఎం కావాలి. అప్పుడే రైతుల రాజ్యం వస్తది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తా మంటున్నారు. అలా అయితే రైతులకు ఇబ్బం దులు తప్పవు. రైతులంతా ఆగం కావాల్సిందే. రికార్డు లన్నీ తారుమారవుతాయి. పట్వారీ వ్యవస్థ వస్తే దళారీల పెత్తనం మొదల వుతుంది. పట్వారీలు రికా ర్డుల్లో ఒకరి పేర ఉన్న భూమిని మరొకరిపేర రా సే అవకాశం ఉంటుంది. ధరణి వల్ల భూములకు రక్షణ కలిగింది. భూముల అమ్మకం, కొనుగోలు ఈజీగా అవుతున్నాయి. 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆన్లైన్లో పహాణీ, 1బీ చూసుకోవడానికి వీలవుతున్నది. ధరణి తీసేస్తే పాతరోజులు వస్తాయి. అధికారుల చుట్టూ తిరిగితిరిగి బేజారు కావాల్సిందే. కొంతమంది రైతులు చేతగాక తమ భూములు కౌలుకు ఇచ్చి దాని ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. కౌలుకాలం తీసుకొస్తే కౌలుదారులు తమ భూములను వారి పేర మార్చుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ను నమ్మితే నట్టేట ముంచుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల భూములకు రక్షణ ఉండాలనే ధరణిని తీసుకొచ్చారు. మా కోసం ఎంతో మంచి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటాం.
సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతుల భూ ములకు భద్రత కల్పించిందింది అక్షరాల సత్యం. దీంతో ఎవ్వరి భూములు వారి ఆధీనంలో ఉన్నా యి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడు తూ ధరణి వ్యవస్థను తొలగించి భూమాత తీసుకొ చ్చి లిటిగేషన్ చట్టాలను తిరిగి తెచ్చేందుకు కాంగ్రెస్ కుటిల యత్నం చేస్తుంది. భూమాత తీసుకొస్తే రెవెన్యూ శాఖలో లంచాల బెడద ఎక్కువైయితది. గ్రామాల్లో భూతగాదాలు జరుగుతాయి. పట్టాదారు ని పేరుతోపాటు కౌలుదారుని కాలం చేర్చితే రైతుల మధ్య ఘర్షణలు తప్పకుండా జరుగుతాయి. రైతుల భూములకు భద్రత ధరణి పోర్టల్తోనే ఎంతో మేలు, రక్షణ కూడా. భూ యజమానులు, రైతులు ఏ చీకు చింత లేకుండా ఉండడం కాంగ్రెస్కు నచ్చనట్లుంది. అందుకే కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల మాటలు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. అధికారం కోసం అడ్డదారుల్లో ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు ఇబ్బందులు కలిగించే కుటిల యత్నాలు మానుకోవాలి.
రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు వరం లాంటింది. అన్ని భుముల వివారలను ఒకేచొట పొందుపరిచి, వాటి నిర్వహణ అదికారులను చేతుల్లో నుంచి తీసేశారు. దీంతో ప్రభుత్వ రెవన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టా లు పోయాయి రైతులు వచ్చి వేలు ముద్రవేస్తేనే గానీ రైతుల భూమి మా ర్పిడి ఉండని పరిస్థితికి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ధరణి పోర్టల్ ద్వారా రైతుబంధు, రైతు బీమా, పంట కోనుగోళ్లను ఇతర స్రయోజనాలు కూడా రైతులకు కలిసి వస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో అధికారులు, పైరవీకారులు రైతులను రాచీ రంపాన పెట్టారు. ఒకరి పేరున ఉన్న భూమిని ఒకరిపై మార్చి వాటిని మార్చుకోవడానికి నెలలు, సంవత్సరాల తరబడి తాసీల్దార్ కార్యాలయాలు చుట్టూ తిప్పించారు. అయినా సక్రమంగా పనులు జరిగేవీ కాదు. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంది. ధరణిని యథావిధిగా కొనసాగించాలి. మళ్లీ సీఎం కేసీఆర్ సారే అధికారంలోకి రావాలి.
రైతులకు ఎంతో మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ ధరణిని ప్రవేశపెట్టారు. అన్ని పనులు క్షణాల్లోనే జరుగుతున్నాయి. పావుగుంటలోనే ల్యాండ్ మ్యూటేషన్ ప్రక్రియ కూడా ముగుస్తున్నది. పట్టదారు పాసుపుస్తకం వస్తున్నది. ఎన్నో అంచనాలతో ధరణిపోర్టల్ రూపుదిద్దుకున్నది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను ఒకేసారి పొందుపరిచి, భూముల నిర్వహణను అధికారుల చేతుల్లో నుంచి రైతుల చేతుల్లోకి వచ్చింది. దీంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పోయింది. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుల బతుకులు నాశనమవుతాయి. భూముల రికార్డులను దళారులు తారుమారు చేస్తారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా దళారులను ఆశ్రయించి రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ధరణి వచ్చాక ఆ పరిస్థితి లేదు. ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే క్రయవిక్రయాలు నిమిషాల్లో జరుగుతున్నాయి. పాత పద్ధతి మా కొద్దు. ధరణి ఉండాలి. మళ్లీ కేసీఆర్ సారే అధికారంలోకి రావాలి.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల వ్యవసాయ భూములకు భద్రత రక్షణ కవచంగా ధరణిని తీసుకువచ్చింది. ధరణి రావడంతో రైతుల భూములు గోల్మాల్ కావడం లేదు. గతంలో అధికారులు పైరవీకారుతో కుమ్మక్కై రైతుల భూములను గోల్మాల్ చేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. గతంలో వ్యవసాయ భూముల విషయంలో ప్రతి సంవత్సరం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి పహాణీని పరిశీలించుకునే వాళ్లం. ఎవరొచ్చి భూమి అనుభవదారి కాలంలో పేరు ఎక్కించుకొని బ్యాంకు రుణం తీసుకుంటారో అర్థం తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ధరణి వల్ల ఒక్కసారి పట్టా వస్తే ఆన్లైన్లో చూసుకోవచ్చు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలి. మా మద్దతు సీఎం కేసీఆర్కే..
తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీ వ్యవస్థ ఏర్పడుతుంది. ధరణి పోర్టల్ను తీసేస్తే మళ్లీ దళారుల రా జ్యం వచ్చే అవకాశం ఉన్నది. సీఎం కేసీఆర్ నిరుపేద రైతుల కో సం ఎంతో ముందు చూపుతో ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. దీంతో రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయా యి. భూ యజమాని ప్రమేయం లేకుండా ఎలాంటి భూ లావా దేవీలు చేయడానికి వీలు లేదు. ఐదు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అన్నీ పూర్తవుతున్నాయి. గతంలో నా భూమి ఆన్లైన్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూమి ఆన్లైన్ చేయాలంటే నానా అవస్థలు పడేవాళ్లం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యుటేషన్ కోసం చెప్పులరిగేలా తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప ని జరిగేది కాదు. డబ్బులిచ్చి రెవెన్యూ అధికారులను వేడుకున్నా ఏండ్ల తరబడి ఫైలు కదలకపోయేది. ఇప్పడు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పని లేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలే దు. ఒక్క వేలి ముద్రతో పని పూర్తవుతుంది. కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేస్తామన డం దారుణం. గతంలో అవినీతి అక్రమాలను పెం చి పోషించిన కాం గ్రెస్ నాయ కులు మళ్లీ దళారుల రాజ్యానికి ఆ జ్యం పోయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నూ ధరణి పోర్టల్ ఉండాల్సిందే.
3 గంటల కరెంట్ ఇస్తే రైతులు వ్యవసాయం మానుకో వాల్సిందే , ఆ కరెంట్తో రైతులకు కన్నీరు తప్ప మిగిలేదేమి లేదు. 3 గంటలంటే 5 హెచ్పీ మోటరు బదులు 10 హెచ్పీ మోటారు పెట్టాలి. 3 గంటల కరెంట్తో రైతులందరూ 10 హెచ్పీ మోటారు వాడితే రైతులందరు ఒకే సారి మోటారు ఆన్ చేస్తే లోడ్ ఎక్కువై మోటరు, వైరు, ఒక్కోసారి ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. రైతులు వ్యవసాయం మానుకోని ఏదైనా కూలి పనులకు పోవాల్సి వస్తుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు కష్టాలు తెలుసుకొని ఇస్తున్న 24గంటల కరెంట్తోని వ్యవసాయం చేసుకొని హయిగా జీవితం వెళ్లదీసుకుంటున్నాం. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే గతంలో ఎదురైన కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయి. 3 గంటల కరెంట్తో పంటలు పండించలేం, కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మితే రైతులంతా ఆగం కావాల్సిందే. అందుకే రైతులందరం సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలతో ఎన్నో బాధలు పడ్డం. బావుల్లో నీరున్నా ఎకరం, రెండెకరాలు పారుడే కష్టంగా ఉండేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నారు. నాణ్యమైన కరెంట్ ఇస్తుండడంతో ఏడాదిలో రెండు, మూడు పంటలు పండించుకుంటున్నాం. మళ్లీ కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు, ఇబ్బందులు భరించలేం. కాంగ్రెస్ నాయకులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇది రైతులకు మరింత మోయలేని భారం, ఇప్పుడు 3హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు పెట్టుకొని సాఫీగా వ్యవసాయం చేసుకునేటోళ్లు, వాళ్లిచ్చే 3 గంటల కరెంట్ కోసం 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలా..? అసలు రైతులు వ్యవసాయం చేసుకోవడం వారికి ఇష్టం లేనట్లుంది. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ సారే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. 24 గంటల కరెంట్ కొనసాగాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు బదులు మూడు గంటలు ఇస్తామంటున్నారు. అలా చేస్తే మాకు మళ్లీ కష్టాలు మొదటికే వస్తాయి. వారి మాటలు రైతులు నమ్మొద్దు. ఏ రాష్ట్రంలో కూడా 24గంటల కరెంటు ఇవ్వడంలేదు. మూడు గంటల కరెంటుతో పొలంలో ఒక్క మూల కూడా పారదు. రేవంత్రెడ్డికి వ్యవసాయం మీద అవగాహన లేక అలా మాట్లాడుతున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు 10 హెచ్పీ మోటర్లు పెడితే కరెంటు వాడకం పెరిగితే ట్రాన్స్ఫార్మర్లు తట్టుకుంటాయా..? వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇచ్చే 24 గంటల ఉచిత కరెంటే చాలు. ఎప్పుడు పడితే అప్పుడు పొలం వద్దకెళ్లి నీరు పారిచ్చుకుంటున్నం. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వక ఇంటికాన్నే పెండ్లాం పిల్లల్ని వదిలేసి పొలం గెట్లపై పడుకునేటోళ్లం. కరెంటు వచ్చినప్పుడు నీళ్లు పెట్టాలె. మధ్యలో తీసేస్తే మళ్ల వచ్చేదాక ఆగాలె. తెల్లవాళ్లు జాగారమయ్యేది. ఇప్పుడైతే పగలు పని చేసుకుని రాత్రి హాయిగా నిద్రపోతున్నం. గతంలో నిద్రకానక సచ్చినం. ఇప్పుడు ఎలాంటి చింత లేదు. కారు గుర్తుకే ఓటు వేసి కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి సీఎంను చేస్తం. అధికారం కోసం వచ్చే కాంగ్రెసోళ్ల మాటలు, మోటర్లకు మీటర్లు పెట్టే పాలకులను మేం నమ్మం.
24 గంటల ఉచిత కరెంట్తో హాయిగా వ్యవసాయం చేసుకొని పంటలు పండిస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి వ్యవసాయం మీద సోయి లేదు. చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్పీ మోటర్లు వాడరు అనే విషయాన్ని గమ నించాలి. ఒక సాధారణ రైతు 10 హెచ్పీ మోటరు వాడాలంటే దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఎన్నికల్లో లబ్ధికోసమే కాంగ్రెస్ నాయ కులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం ఇలా రైతులతో రాజకీయం చేస్తున్నరు. వ్యవసాయం మీద అవగాహన లేని కాంగ్రెస్ నాయకులకు రైతుల పని వారి అవసరాలు ఏం తెలుసు, కాంగ్రెసోళ్లు వ్యవసాయాన్ని డెవలప్ చేసు డు కాదు మొత్తం ఆగం పట్టించేటట్లు ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చేది లే దు సచ్చేది లేదు. మా రైతుల కష్టాలు తెలిసి మాకు ఎంతో సహాయపడుతున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ వెంటే మేమంతా ఉంటాం. సీఎం కేసీఆర్ సార్ 24 గంటల కరెంటే కరెక్ట్. కాంగ్రెస్ పాలనలో రైతులెందరో కరెంట్ షాక్కు, పాముకాటుకు గురై సచ్చిండ్రు. గిప్పుడు ఆ పరిస్థితి ఉందా? రైతులు మధ్యాహ్నం యాలల్లోనే పైర్లకు నీళ్లు పారించుకుంటూ రాత్రి యాళ వరకు ఇండ్లకొచ్చి పిల్లాపాపలతో గడుపుతున్నరు. గప్పుడు రైతు రాత్రి సేనికి పోతే పొద్దున వరకు ఇంటికొచ్చే నమ్మకం లేదు. కరెంట్ సంగతిలో కేసీఆర్కు మించి ఎవ్వర్ జెయ్యలె బరాబర్. – విజయభాస్కర్రెడ్డి, రైతు, దమగ్నాపూర్ గ్రామం,
ఎన్నో ఏండ్లుగా రైతులు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా చూసిన మహాను భావుడు మా కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డా క రైతును రాజు చేయాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ అహర్ని శలు కృషి చేస్తున్నాడు. రైతుల కోసం ఏ దేశంలో లేనట్టువంటి 24గంటల ఉచిత కరెంట్తోపాటు, వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండ్రు. కాంగ్రెసోళ్లు ఇప్పుడోచ్చి మూడు గంటలు కరెంట్ ఇస్తాం. 10హెచ్పీ మోటర్లు పెట్టుకొండి అంటూ.. రైతులను మోసగించాలన్ని చూస్తున్నది. వ్యవసాయ పోలాల్లో వేసిన పంటకు తెగులు తగిలితే ఏ మందు వాడాల్లో మాకు తెలుసు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెసోళ్లకు అట్లే బుద్ధి చెబుతాం.. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళితో ముందుకు పోతున్నది. కాంగ్రెసోళ్లు పూటకో మాట ఇష్టం వచ్చినట్లు మాట్టాడుతున్నారు. ఇలాంటి కాంగ్రెస్ నాయకులను మేము నమ్మం. మా రైతాంగమంతా సీఎం కేసీఆర్ వేంటే ఉంటాం.
కేసీఆర్ రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తుండ్రు. ఇది బాగా లేదనట్లుగా రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటే రైతులకు చాలు అని మాట్లాడిన తీరు బాధిస్తుంది. అదే కాకుండా 10 హెచ్పీ మోటర్లు రైతులు వాడితే రైతుకు అదనంగా భారమయితది. అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. రైతులు చాలా మటుకు 3హెచ్పీ నుంచి 5 హెచ్పీ మోటర్లనే వాడుతున్నరు. పెద్ద పెద్ద కమతాలున్నా రైతులైతే 10హెచ్పీ మోటర్లు వాడిని ఉపయోగం ఉంటది. కానీ 10హెచ్పీ మోటర్లు బిగించుకొని ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తే ట్రాన్స్పార్మర్లు పేలిపోతయి. ఏ మాటకు ఆ మాట నిజం చెప్పాలి. కేసీఆర్ సర్కారు వచ్చినంకనే రైతులకు సాగు నీరు. 24 గంటలు ఉచిత కరెంట్ అందించడం మూలంగానే రైతులు బాగుపడుతున్నారు. ఇది వరకు కరెంట్ ఎప్పుడొచ్చేదేమోనని బోర్లు బావుల వద్ద రైతులు రాత్రిపూట కరెంట్ కోసం జాగరణ చేసిన రోజులున్నయి. ఒక్కొక్కసారి కరెంట్, విషసర్పాల కాటుకు గురై రైతులు కాలమైన ఘటనలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్ ఇస్తుంటే కాదని రేవంత్రెడ్డి మూడు గంటలే చాలని చెప్పడం సరైన పద్ధతి కాదు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతులకు మళ్లీ కాళరాత్రులే వస్తాయి. కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట ఇచ్చే మూడు గంటల కరెంట్ కూడా ఎప్పడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. దీంతో పగటి పూట పొలం కాడికి పోయి నీళ్లు పారబెట్టుకుంటున్నాం. రాత్రి పూట హాయిగా ఇంటి వద్ద పడుకుంటున్నాం. గతంలో రాత్రి పూట పొలంకాడికి పోయినోళ్లు పాముకాటుకు, కరెంట్ షాక్కు గురై మృతిచెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్షకట్టింది. రైతులు సుఖంగా ఉండడం వారికి ఇష్టం లేదు. మాకు రేవంత్రెడ్డి వద్దు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతడో తెల్వదు. ఒకసారి మూడు గంటల కరెంట్ అంటడు. మరోసారి కౌలు రైతులకే రైతుబంధు ఇయ్యాలి, రైతులకు వద్దు అంటడు. మతిస్థిమితం లేకుండా మాట్లాడే రేవంత్రెడ్డిని రైతులు క్షమించారు. రైతులమంతా బీఆర్ఎస్ వైపే ఉన్నాం. మాకు సంక్షేమం కోరే బీఆర్ఎస్ సర్కారే కావాలి. రైతును క్షోభపెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు.
కా్ంర గెస్ అంటేనే కరెంటు కష్టాలు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు బాధలు తప్పాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నరు. రైతుబంధు, రైతుబీమా వస్తున్నది. కాంగ్రెస్సోళ్ల పాలనలో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి ఉండేది. అప్పట్లో ఎమ్మెల్యేను కలవాలంటే గ్రామంలో ఒక నాయకుడిని వెంటబెట్టుకుపొవాల్సి వస్తుండె. ఆ నాయకుడికి మంచిచెడూ చూసుకోవాలి. ఏమి ఉపయోగం లేకుంటుండె. వ్యవసాయం చేయలేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. కాంగ్రెస్సోళ్లు వచ్చి మూడు గంటల కరెంటు చాలు.. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోండి అని చెబుతుంటే నవ్వొస్తున్నది. వ్యవసాయం చేసేవాడికి రైతుల బాధలు తెలుస్తది. కాంగ్రెస్ రావద్దు.. ఆ మూడు గంటల కరెంటు అసలే వద్దు. మాకు కేసీఆరే కావాలి. రైతుల బాధలు తెలిసిన కారు గుర్తుకే మా ఓటు.
కాంగ్రెసోళ్లు చెప్పేవని వట్టి సొల్లు మా టలుగానే ఉన్నాయి. 55ఏండ్లపాటు అధికారంలో ఉన్నారు. రైతులకు చేసిన మేలు ఏమిటో మాకు తెలియదా? సా గునీళ్లు దేవుడెరుగు. కనీసం తాగనీకే మం చినీళ్లు కూడా ఇయ్యనీకె చేతగాలే. ఇ ప్పుడొచ్చి రైతులకు ఏదో చేస్తామని చెబితే నమ్ముతారా. తెలంగాణ రాష్ట్రం వొచ్చినంక సీఎం కేసీఆర్ సారు రైతుల కష్టాలు తీర్చిండు. ధరణి తీసుకువచ్చి భూ సమస్యలన్నింటినీ పరిష్కరించారు. ఎప్పటి నుంచో పట్టా కానీ నా భూమికి ధరణి వచ్చిన తర్వాత పాస్ పుస్తకం వచ్చింది. అంతా మంచిగున్నది అనుకునేలోపే కాంగ్రెసోళ్లు మల్లా వ్యవసాయాన్ని ఆగం చేసే కుట్ర చేస్తున్నరు. అప్పట్లా కరెంటు ఎప్పుడొస్తదా అని రాత్రంతా పొలాల వద్దే పడిగాపులు కాసేటోళ్లం. ఇయ్యాలా 24గంటల కరెంటుతో ఇంటి వద్ద హాయిగా నిద్రపోతున్నాం. రైతుకు కరెంటు, నీళ్లు, ఎరువులు ఇచ్చి పండించిన పంటను కూడా సమయానికి కొంటున్నరు. సీదా అకౌంటులోనే డబ్బులు పడుతున్నయి. ఇంత మంచిగున్న వ్యవసాయాన్ని మూడు గంటల కరెంటు చేస్తాం, పెద్ద మోటర్లు పెట్టుకోవాలని రేవంత్రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నడు. కలలో కూడా కాంగ్రెస్ రావొద్దు. మళ్లీ ఆ బాధలు అనుభవించొద్దు. రైతులంతా కేసీఆర్ సారుకు అండగా నిలిచి గెలిపించుకుందాం.
రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చిండు. మా భూ ములన్నింటికీ భద్రత తెచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో రైతుల భూముల రిజిస్ట్రే షన్లు, మ్యుటేషన్ల కోసం రోజులు, నెలల తరబడి తిరిగినా పనులు అయ్యేవికావు. నే డు రిజిస్ట్రేషన్కు ఇలా వెళ్లి అలా వచ్చేస్తు న్నాం. వారంలోగా పాస్బుక్కు నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. గతంలా పటేల్, పట్వారీలు గ్రామాల్లోని రైతుల భూముల ను ఒకరి పేరువి మరొకరికి చేసి కిరికిరిపెట్టేటోళ్లు. నేడు ధరణి తీసుకురావడం వల్ల అలాంటి పంచాయితీలన్నీ బంద్ అయినవి. దళారుల బెడద కూడా పూర్తిగా తప్పింది.ఇంత మంచి పథకాన్ని కాంగ్రెస్ వాళ్లు బంగా ళాఖాతంలో వేయాలని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం. ధరణితోనే రైతులకు లాభం. అందుకే ధరణిని కొనసాగించడానికి సీఎం కేసీఆర్ సారే మళ్లీ రావాలి.
కరెంటు కష్టాలతో 55 ఏండ్లు ఎన్నో బాధలు పడ్డాం. సాగు చేసుకోవడానికి భూములున్నా కరెంటు, సాగునీరు లేక బీడుగా ఉండేవి. సీఎం కేసీఆర్ సారు వొచ్చినంక 24గంటల కరెంటుతో రెండు పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడొచ్చిన కాంగ్రెసోళ్లు వ్యవసాయానికి కరెంట్ మూ డు గంటలే సాలు అంటున్నరు. 10హెచ్పీ మోట ర్లు పెట్టుకొంటే సరిపోతుందని రేవంత్రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి వారికి అధికారమిస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తరు. వ్యవసాయం గురించి, రైతుల బాధల గురించి తెలిసిన సీఎం కేసీఆర్ సార్కే మా మద్దతు తెలుపుతాం. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా పథకాలతోపాటు 24 గంటల కరెంట్ ఇచ్చి అండగా నిలుస్తున్నరు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్పోతే ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. కరెంటు ఉంటేనే ఆశ్యర్యపోవాలి. ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకుండె. రాత్రి, పగలు తేడా లేకుండా రైతులంతా సేన్ల కాడ ఉండేడిది. కరెంట్ పోయి వస్తుంటే తడిచిన పొలమే తడిచేది. 3గంటల కరెంటు చాలు, పంటలు పండుతయని కాంగ్రెసోల్లు అంటున్నరు. ఇంతకు వారు వ్యవసాయం చేసిండ్రా అనే అనుమానమైతుంది. గతంలో కరెంట్ సరిగా ఇయ్యక పంటలు ఎండిపోయి రైతులు నష్టాలపాలైండ్రు. పంట పెట్టుబడి కన్నా కరెంటు బిల్లులు, మోటర్ల రిపేర్లే ఎక్కువయ్యేటివి. మోటర్లు అందరూ ఒకేసారి వేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. అవి రిపేర్ చేసి పెట్టనిక్కె మస్తు టైం పట్టేది. ఇలా పంటలు పండక రైతులు పట్నం బాటపట్టిన సందర్భాలున్నాయి. తెలంగాణ వచ్చాక 24గంటల కరెంటు ఇస్తున్నరు. ఎప్పుడు అవసరమైతే అప్పుడెళ్లి మోటర్లు ఆన్ చేసి పంటలు పండించుకుంటున్నరు. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా సాగునీరు అందిస్తుండడంతో వలసెళ్లిన రైతులు మల్ల సొంతూళ్లకొచ్చి పంటలు చేసుకుంటున్నరు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మల్ల కరెంటు కష్టాలు తప్పవు.
తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ధరణి తీసుకొచ్చి శానా మేలు చేసిండు. రైతులు భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఒక్క రోజులో పనైపోతుంది. దీంతో రైతులకు సమయంతోపాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నయి. గతంలో భూములు కొంటే నియోజకవర్గ కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి పని చేసుకోవాల్సి వచ్చేది. అక్కడ దళారులతోనే పనయ్యేది. దీంతో రిజిస్ట్రేషన్ ఖర్చుకు మూడింతలు వెచ్చించాల్సి వచ్చేది. ఎందుకంటే రిజిస్ట్రేషన్కు ఇరువురికి చెందిన వ్యక్తులు వస్తరు. వారి చార్జీలు, భోజనాలు ఇతర ఖర్చులన్నీ కలిసి మోపెడయ్యేవి. సీఎం కేసీఆర్ ధరణి తెచ్చినంక మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నరు. దీంతో రైతులకు శానా బాధలు తప్పినయ్. దళారీల పని కూడా పడదు. రిజిస్ట్రేషన్ అయినెంటనే వారి పేరుమీద భూమి ఆన్లైన్ అయితది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తమని చెప్తున్నరు. ఆ మాట ఇనంగనే పాత రోజులు గుర్తొస్తున్నయ్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా రికార్డుల్లో భూమి తన పేర నమోదు చేయనీకె ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఎన్నికల్లో మేమంతా ఏకమై కాంగ్రెస్ను పాతరేసి కేసీఆర్కే మద్దతిస్తాం.
సీఎం కేసీఆర్ రైతుల కోసం ధరణి ఫోర్టల్ తీసుకొచ్చి భూములకు భద్రత కల్పిస్తున్నరు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామంటున్నది. ధరణి తీసేస్తే రైతులు ఆగమాగం కావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. రెవెన్యూ రికార్డులు గోల్మాల్ చేసి రికార్డులు మాయం చేసి సామన్య రైతులను మోసం చేసిండ్రురు. ప్రస్తుతం ధరణితో పట్టా పాసుపుస్తకం అరచేతిలో భూమి వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నాం. కేసీఆర్ సారు చేసిన గొప్ప పనులు గతంలా ఏ నాయకుడు చేయలే. అనాలోచితంగా కాంగ్రెస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయం. రైతులు ఆలోచించి మేలు చేసే వారికి అండగా నిలవాలి.