గోపాల్పేట, నవంబర్ 20: ఉమ్మడి పాలనలో కరువు కష్టాలను చవిచూసి బతుకు దెరువు కోసం వలసలు వెళ్లిన సందర్భాలను కండ్లారా చూసిన వ్యక్తిని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కష్టాలు మొత్తం పోతాయని బలంగా నమ్మిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట ఉమ్మడి జిల్లాలో మొదటి జెండా ఎత్తుకుని 14ఏం డ్లు గ్రామ గ్రామాన గులాబీ విత్తనాలు చల్లుతూ నేడు గులాబీ దండును తయారు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం గోపాల్పేట, రేవల్లి మండలాలోని స్థానిక నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే మొదటి వరుసలో నిలుస్తున్నాం అలాంటి ప్రభుత్వాన్ని , ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎంతో వేగవంతంగా అభివృద్ధి పనులను చేసి ప్రజల కండ్ల ముందు పెట్టాను ఇలాంటి ప్రజా సర్కారును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి వివరించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం కేసీఆర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిని ఇచ్చారని ప్రజలకు కావాల్సిన అన్ని వసతులను కల్పించడంతో 2018 ఎన్నికల్లో భారి మెజార్టీతో అందించారన్నారు.
మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రైతన్నలకు పెద్ద జీతగాడిలా పనిచేసి దేశం మొత్తం తెలంగాణ వ్యవసాయం వైపు చూసేలా పని చేశానని గుర్తుచేశారు. 6 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండానికి జూరాలను కట్టడానికి 40ఏండ్లు పట్టింది. అంతే నిల్వ సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ను రెండ్లేండ్లలో పూర్తి చేశామని పేర్కొన్నారు. వనపర్తి పట్టణాన్ని పట్టుబట్టి జిల్లా కేంద్రంగా మార్చడంతో జిల్లా అధికారులు అందరూ అందుబాటులో ఉండడంతో పనులు సైతం వేగవంతంగా పూర్తి అవుతున్నాయన్నారు. సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి చెక్కులను అందజేసే సమయంలో స్థానిక నాయకులతో పంపించకుండా మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు పిలిపించి నాకు ఉన్నంతలో అన్నం పెట్టి చెక్కులు అందజేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆసరా, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తున్నామని మిగిలిన మహిళలకు సైతం సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీని భరించి గ్యాస్ సిలిండర్ను రూ 400 అందజేయడం, సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న నిరుపేద మహిళలకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. జరిగిన పనులు అన్నీ ప్రజల కండ్ల ముందు పెట్టాను. అభివృద్ధి జరిగిందని అనిపిస్తే ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2వ నెంబర్ బటన్ మీద నొక్కి ఓటు వేసి రెండో సారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
దేశం మొత్తం వాల్మికీ బోయలు ఎస్టీలుగా ఉన్నారని, ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే బీసీల్లో కలిపి మోసం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి నిరంజన్రెడ్డి వివరించారు. వాల్మికి బోయల స్థితిగతుల పైన చెల్లప్ప కమిషన్ వేసి అధ్యాయనం చేయించి వచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయించి కేంద్రానికి పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంచారని గుర్తుచేశారు.
గతంలో నా ప్రతి గెలుపులో ప్రధాన పాత్ర పోషించిందే గోపాల్పేట మండలం అని ఇక్కడ ప్రతి ఒక్కరితో అనుబంధం విడదీయలేనిది అలాంటి గోపాల్పేటను నా ప్రాణం ఉన్నత వరకు మరిచిపోనని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నా రు.
ప్రజల సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు మంత్రి నిరంజర్రెడ్డిని మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. కేసీఆర్ సర్కార్ అందిస్తున్న, ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాల గురించి వివరించారు.
అడ్డాకుల మండలం కనుమనూర్ గ్రామం కాంగ్రెస్ వార్డు సభ్యురాలు వాసీమా బేగం ఆధ్వర్యంలో పెద్దమందడి మండ లం నుంచి, పెబ్బేరు మున్సిపాలిటీ నుంచి 100 మంది ముస్లిం మహిళలు, గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామం, మండల కేంద్రంలో టీడీపీ నుంచి ఆంజనేయులుతోపాటు 10మంది నా యకులు, చెన్నూరు గ్రామంలో గౌడ సంఘం నుంచి 20మంది కులస్తులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో డాక్టర్ భూపేష్, నాగం తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీలు మం ద భార్గవి, బోర్ల భీమయ్య, ఎంపీపీలు అడ్డాకుల సంధ్య,సేనాపతి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మధుసూదన్రెడ్డి, జిల్లా గొర్రెల కాపరుల సంఘం ఉపాధ్యక్షులు చంద్రయ్య యాదవ్, జిల్లా డైరక్టర్ పరశురాం యాదవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయ క్, సింగిల్విండో చైర్మన్ రఘుయాదవ్, వైస్ చైర్మన్ గువ్వల రాములు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతియాదవ్, నారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, రఘురామారావు, మహిళా కమిటీ అధ్యక్షురాలు అనురాధ, శశికళ, ఉపాధ్యక్షురాలు కర్రోళ్ల స్వప్న, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డె మాన్ రవి, సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.