కొల్లాపూర్, డిసెంబర్ 6 : తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీలోని రాయలసీమలో నిర్మాణమవుతున్న మరో సాగునీటి ప్రాజెక్టు వెలుగోడుకు నదీ మార్గం మీదుగా లాం చీలో మళ్లీ భారీ వాహనాలు తరలిపోతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మం డలంలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వినియోగించిన ఓ పేరుమోసిన కంపెనీకి చెందిన భారీ వాహనాలు ఆంధ్రాలో నంద్యాల జిల్లా వెలుగోడు ప్రా జెక్టు పనులకు ఉపయోగించేందుకు తరలించారు. మంగళవారం లాంచీలో ఆయిల్ ట్యాంకర్, సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ వాహనలను ఆవతలి వైపునకు తరలిస్తున్న దృశ్యా లు అమరగిరి వద్ద ’నమస్తే తెలంగాణ’కు చిక్కాయి.
పాలమూరు లిఫ్ట్లో కొన్ని విభాగాల పనులను చేపట్టిన కాంట్రాక్టరే, ఆంధ్రాలోని వెలుగోడు ప్రాజెక్టును చేపట్టారని తెలిసింది. శ్రీశైలం తిరుగు జలాలు నిల్వ ప్రాంతం (వేపల చెరువు ప్రాంతం)నుంచి ఈ భారీ వాహనాలను కోతిగుండు, అమరగిరి, మల్లయ్యసెల, జానాల, సోమశిల, సి ద్దేశ్వరం మీదుగాపై కృష్ణానదిపై నుంచి తరలుతున్నాయి. వాహనాలను నదిపై సులభమైన మార్గంలో సమయం, వ్యయం తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో తరలిస్తున్నారని స మాచారం. ఈ మార్గంలో లాంచీపై రెండున్నర గంటల సమయంలో వెలుగోడు ప్రాజెక్టుకు చేరుకుంటామని కొందరు జాలర్లు తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే చుట్టూ తిరిగి సుమారు 170 కి.మీ. వెళ్లాల్సి వస్తుందని వాహనాదారులు తెలిపారు.