నవాబ్పేట, మే 6 : మండలంలోని వివిధ గ్రామా ల్లో శనివారం భారీ వర్షం కురిసింది. నవాబ్పేట, రుద్రారం, యన్మన్గండ్ల, రుక్కంపల్లి, ఇప్పటూర్, లోకిరేవు, లింగంపల్లి, చాకలిపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో స్థానిక మార్కెట్యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు ఇటీవలే రైతులు పంటకోతలు చేపట్టి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తున్నారు. మార్కెట్యార్డులో కొందరు రైతులు ధాన్యా న్ని ఆరబోసుకోగా, మరికొందరు కుప్పలుగా పోశారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ధాన్యం పూర్తిగా తడిసింది. ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నీటి లో ధాన్యం కొట్టుకుపోకుండా అష్టకష్టాలు పడ్డారు. కాగా భారీ వర్షంతో చాలా గ్రామాల్లో వరి చేనులోకి నీరు వచ్చి చేరింది. దీంతో వరికోతలు మరో ఐదారు రోజులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
మూసాపేట మండలంలో..
మూసాపేట, మే 6 : మండలంలోని నిజాలాపూర్, కొమిరెడ్డిపల్లి, జానంపేట తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఆరబెట్టిన ధాన్యాన్ని అమ్ముకునే సమయంలో వర్షం రావడంతో ఆవేదనకు గురయ్యారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, మే 6 : జడ్చర్ల మండలంలో శనివారం మోస్తారు వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. అకాలవర్షంతో వరికోతలు నిలిచిపోయాయి. చేతికొచ్చిన పంట లు వర్షానికి తడిసి నేలకొరిగాయి. నూర్పిళ్లు చేసిన ధా న్యం ఆరబెట్టేందుకు రైతులకు ఇబ్బందిగా మారింది.