వనపర్తి, మే 15 : డెంగీజ్వరం పేరు వింటేనే ప్రజల్లో ఒకరకమైన దఢ మొదలవుతుంది. డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడ కేసు లు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే వ్యాధిని అరికట్టవ చ్చు. సమాజంలోని ప్రజలందరూ డెంగీపై అవగాహన ఉంటే దేశం నుంచి తరిమికొట్టవచ్చు. ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకుగానూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రతి ఏడాది మే 16న జాతీయ డెంగీ నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నది.
చికిత్స ఇలా…
సాధారణంగా వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు కచ్చితమైన చికిత్స ఏమీ లేదు. డెంగీకి కూడా కచ్చితమైన చికిత్స లేదు. రోగి లక్షణాలను మేరకు చేసే చికిత్స అనేది సహాయకారిగా మాత్రమే ఉంటుంది. రోగికి పూర్తి విశ్రాంతితోపాటు ద్రవరూప ఆహారం ఇవ్వాలి. నొప్పి నివారణకు ఆస్ట్రిన్ ఐబ్రూపెన్ వంటి మాత్రలు వాడకూడదు.
వ్యాప్తి ఇలా..
డెంగీ సిరోటైఫ్ 1,2,3,4 అనే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేయడంలో ఆడ ఏడిస్ ఈజిప్టయి అనే దోమ ప్రధానపాత్ర పోషిస్తుంది. డెంగీజ్వరం వ్యాపించేందుకు 16నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలమైనది. ఈ దోమలు పగలు, రాత్రివేళల్లో కూడా కుడుతాయి. అయితే క్లాసికల్ డెంగీజ్వరం, డెంగీ హిమారాజికల్ జ్వరం, డెంగీ షాక్ సిండ్రోమ్ అనే మూడు దశల్లో వ్యాధి కనిపిస్తుంది.
క్లాసికల్ డెంగీజ్వరం..
డెంగీ హిమారాజికల్ జ్వరం..
డెంగీ షాక్ సిండ్రోమ్..
వ్యాధి నిర్దారణ ఇలా..
డెంగీ జ్వరంగా అనుమానించబడిన రోగికి సంపూర్ణ రక్త పరీక్ష చేయాలి. దీనిలో తెల్లరక్త కణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కణాల సంఖ్య తగ్గడం, ఎర్ర రక్తకణాల పరిమాణం పెరగడం మేరకు ఎలీసా పరీక్షతో కచ్చితంగా నిర్దారించవచ్చు.
నియంత్రణ చర్యలు..
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు, గ్రామస్థాయిలో ఆశ కార్యకర్తల సహకారంతో బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ బృందాలతో యాంటీలార్వా ఆపరేష న్స్, డెంగీజ్వరంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జిల్లాలో డెంగీని సాధ్యమైనంత వరకు తగ్గించడం జరిగింది.
– డాక్టర్ సాయినాథ్రెడ్డి,ప్రోగ్రాం అధికారి, వనపర్తి జిల్లా