మక్తల్ టౌన్, మార్చి18: రాష్ట్రంలో ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సర్కార్ దవాఖానలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మక్తల్ పట్టణానికి చెందిన అశోక్కుమార్కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.56వేల చెక్కును లబ్ధిదారుడికి శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికోసం రాష్ట్రంలో సీఎం సహాయ నిధి పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారాన్నరు. ప్రతిఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సర్కార్ దవాఖానలను అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ ప్రభాత్వానిదేనని పేర్కొన్నారు.
శ్మశానవాటికలకు ప్రహరీలు ఏర్పాటు చేయాలి
మక్తల్ మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్మించిన శ్మశానవాటికలకు ప్రహరీలు ఏర్పాటు చేయాలని తాసిల్దార్ తిరుపత్యయకు ఎమ్మెల్యే చిట్టెం ఆదేశించారు. మక్తల్ పురపాలికలోని 6వ వార్డు చందాపూర్లో కొందరు వ్యక్తులు శ్మశాన వాటికను కబ్జా చేసి ప్లాట్లుగా మారుస్తున్నారని వార్డుమెంబర్ నర్సింహులు, గ్రామానికి చెందిన వందాలాది మంది ప్రజలు శనివారం ఎమ్మెల్యే చిట్టెం నివాసానికి తరలివచ్చి సమస్యను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే చిట్టెం వెంటనే స్పందిస్తూ పురపాలికలోని 6వ వార్డు చందాపూర్లో ఉన్నటువంటి శ్మశానవాటికకు సంబందించిన స్థలాన్ని వెంటనే రెవెన్యూ అధికారులు గుర్తించి ప్రహరీ ఏర్పాటు చేసి ఫినిసింగ్ చేయాలని తాసిల్దార్కు ఎమ్మెల్యే చిట్టెం ఆదేశించారు. పురపాలికలో శ్మశానవాటికలను కబ్జా చేసి, ప్లాట్లు అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్న వారిని చట్టపరంగా శిక్షించనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు, చందాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.