కల్వకుర్తి, డిసెంబర్ 6 : శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్యామ్యంలో రాజ్యాంగానికి కట్టుబడి గెలు పోటములను సమానంగా స్వీకరిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి, తన కోసం అహర్నిశలు పనిచేసిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తనకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు మూడుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అందరి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని చెప్పారు. చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉండాలని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశా రు. అదేవిధంగా ఆరు గ్యారెంటీలతోపా టు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. తానూ అందరికీ అం దుబాటులో ఉంటానని, బీఆర్ఎస్ కా ర్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉం టూ, ప్రజల పక్షాన ముందుకు సాగాలని చెప్పారు. కార్యకర్తలు మనోధైర్యం కో ల్పోకుండా పార్టీ కార్యక్రమాలను అనునిత్యం ముందుకు తీసుకెళ్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు.