మహబూబ్నగర్ టౌన్, జనవరి 2 : జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూ ల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హ్యాండ్బాల్ టోర్నీ ముగిసింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో ఆదిలాబాద్ జట్టు మహబూబ్నగర్పై 20-17 గోల్స్ తేడాతో గెలిచి చాంపియన్గా నిలవగా, మహబూబ్నగర్ రన్నర్గా నిలిచింది. బాలికల విభాగంలో వరంగల్ జట్టు ఆదిలాబాద్పై 9-1 గోల్స్ తేడాతో గెలిచి చాంపియన్గా నిలువగా, ఆదిలాబాద్ రన్నర్గా నిలిచింది.
బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టు, బాలుర విభాగంలో వరంగల్ జట్టు మూడోస్థానంలో నిలిచాయి. డీఈవో రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేశ్బాబు, మాజీ సెక్రటరీ మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ రాజేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ శాంత, టోర్నీ ఆర్గనైజర్ జియాఉద్దీన్, పుల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, జగన్మెహన్గౌడ్, బాలు, అహ్మద్హుస్సేన్, ప్రదీప్, రామ్మోహన్, అనిల్, రాధిక, జ్ఞానేశ్వరి, కోచ్ విష్ణువర్ధన్రెడ్డి, ఉమర్ఫర్హాత్ తదితరులున్నారు.