అచ్చంపేట టౌన్, ఏప్రిల్ 24 : కాంగ్రెస్ పార్టీ అధికా రం కోసమే ఆరు గ్యారెంటీలు అన్నదని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడం లేద ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఆ యన బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం ని ర్వహించారు. ఈ సందర్భంగా పదేండ్లలో కేసీఆర్ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వి వరించి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞ ప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధపు హామీ లిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. మూడు నెలల కాంగ్రెస్ పాలనలో పెట్టుబడి సా యం అందక, కరెంట్ లేక పంటలు ఎండిపోయి వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే ప్రజాపాలన కానీ, ప్రజలకు న్యాయం జరుగడం లేదని విమర్శించారు. అందుకే అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కావాలో అన్యాయం చే సే కాంగ్రెస్ కావాలో ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను అత్యధిక మోజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్లో మన గొంతు వినిపించే అవకాశం ఉం టుందని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అమీనొద్దీన్ ఉన్నారు.
వంగూరు, ఏప్రిల్ 24 : కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన అబద్దాల మాటల నమ్మి ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వైవీ ఫంక్షన్ హాల్లో బుధవారం వంగూరు, చారకొండ మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు హాజరై కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎంపీ ఎన్నికల ముందు మరింత మోసపూరిత వాగ్ధానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
దుందూభీ నదిలో అక్రమంగా ఇసుకను కొల్లగొడుతూ కాంగ్రెస్ నేతలు కాసులు వెనకేసుకుంటున్నారు. ట్రాక్టర్లను నడవకుండా చేసి మధ్య తరగతి జీవితాలతో ఆటలాడుతూ టిప్పర్ల ద్వార అడ్డగోలుగా ఇసుకను తరలిస్తుంటే అధికార పక్షం వారికి అండగా నిలుస్తుందన్నారు. ఇసుక మాఫియా అద్దు అదుపూ లేకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ దుందూభీని ఖాళీ చేస్తూ కోట్టు గడిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. ప్రచారాన్ని ఉదయం, సాయంత్రం ఇంటింటికీ తిరుగుతూ కార్యకర్తలు పని చేయాలని కోరారు. 27న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగర్కర్నూల్ పట్టణంలో నిర్వహించే రోడ్షో కార్యక్రమానికి హాజరవుతున్నందున పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చేలా నేతలు కృషి చేయాలన్నారు. సమావేశంలో చారకొండ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్, వంగూరు మండల మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, రాజేందర్రెడ్డి, నరేందర్రావు, నాయకులు లాలూయాదవ్, విజేందర్గౌడ్, సురేందర్, అంజీ, పుల్లయ్యయాదవ్, ఎల్లాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.