నాగర్ కర్నూల్ : జిల్లాలోని గుడిపల్లి ( Gudipally ) రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపి రైతుల పంటలకు సాగు నీరు( Water ) అందించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy ) డిమాండ్ చేశారు. గుడిపల్లి రిజర్వాయర్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు.
రిజర్వాయర్ నీటిని నమ్ముకొని సాగుచేసిన పంటలకు సకాలంలో నీరు అందించక పోవడంపై అధికారులు, ప్రభుత్వంపై తీరుపై మండిపడ్డారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాల్సింది పోయి పట్టించుకోకపోవడం నిర్లక్ష్యాన్ని చాటుతుందని విమర్శించారు. ఇప్పటికీ కేవలం మూడు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగతా రెండు మోటార్లు కూడా పనిచేసేలా చర్యలు తీసుకొని, కాలువ వెడల్పు పనులు చేపట్టాలన్నారు.
ఇంజినీర్లు, రాజకీయ నాయకుల కక్కుర్తి వల్ల నేడు ప్రాజెక్టు బ్రష్టు పట్టిందని విమర్శించారు. రైతులకు సాగునీళ్లు అందక పోయినా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీ గాని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సాగునీటి మంత్రి ఎప్పుడు వచ్చినా చుట్టపు చూపుగా చూసి వెళ్లడమే కానీ ఏ మాత్రం ప్రాజెక్టుల గురించి పట్టింపు లేదన్నారు.గుడిపల్లి కట్ట పొడవున ముళ్ళపొదలు ఏపుగా పెరగడంపై మెయింటెనెన్స్ లేదంటూ అగ్రహించారు.కట్ట పొడవున పెరిగిన చెట్లను తొలగించాలని, లేదంటే వాటి వల్ల కట్టకు ప్రమాదం పొంచి ఉందన్నారు.