జడ్చర్ల, ఫిబ్రవరి 1 : మహబూబ్నగర్, జడ్చర్ల మార్కెట్లకు వేరుశనగ పోటెత్తింది. మద్దతు ధర క న్నా క్వింటాకు రూ.వెయ్యి ఎక్కువ ధర పలుకుతున్నది. పక్షం రోజులుగా వేరుశనగ అమ్మకానికి రా గా తొలుత ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా రానురానూ పెరుగుతున్నాయి. మార్కెట్లో క్రమం గా డిమాండ్ పెరగడంతో వేరుశనగకు మద్దతుకు మించి ధర లభిస్తున్నది. ప్రస్తుతం వేరుశనగకు క్విం టాకు రూ.6,377 మద్దతు ధర ఇస్తుండగా.. బహిరంగ మార్కెట్లో రూ.7,346 పలుకుతున్నది. మ ద్దతు ధర కన్నా ఎక్కువ వస్తుండటంతో రైతులు మార్కెట్లకు వేరుశనగను అధికంగా తరలిస్తున్నారు. గత సీజన్తో పోలిస్తే ధర ఈ ఏడాది చాలా తక్కువగా ఉన్నది. ప్రస్తుతం వేరుశనగా క్వింటాకు కనిష్ఠ ధర రూ.7089 ఉండగా.. గరిష్ఠంగా రూ.7,346 ఉంది. కొంతమంది రైతులు వేరుశనగను ఎండబెట్టకుండా అలాగే మార్కెట్కు తరలిస్తుండగా.. అ లాంటి వాటికి మాత్రం క్వింటాకు రూ.4,100 వర కు లభిస్తున్నది. గురువారం మహబూబ్నగర్ మా ర్కెట్కు సుమారు 10వేల క్వింటాళ్లు, జడ్చర్ల మార్కెట్లకు 5,741 క్వింటాళ్లు వేరుశనగ వచ్చిందని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
కందుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా యి. సీజన్ ప్రారంభంలో క్వింటా రూ.8 వేలు పలకగా.. ప్రస్తుతం రూ.10వేలకు చేరుకున్నది. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతోపాటు పూ తకాత రాలిపోగా దిగుబడులు తగ్గాయి. దీంతో కం ది ధరలు అధికంగా ఉన్నాయి. బాదేపల్లి వ్యవసా య మార్కెట్లో గురువారం 21 క్వింటాళ్ల కందు లు అమ్మకానికి రాగా.. గరిష్ఠంగా రూ.9,969, కనిష్ఠంగా రూ.9,410, మధ్యస్తంగా రూ.9,879 ధర పలికింది. 5,741 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్ఠంగా రూ.7,387, కనిష్ఠంగా రూ.4,069, మధ్యస్తంగా రూ.7,039.., ఆర్ఎన్ఆర్ ధాన్యానికి గరిష్ఠంగా రూ.3,136, సోనమసూరి ధాన్యానికి గరిష్ఠంగా రూ.3,105, జొన్నలకు రూ.5,555, బెబ్బర్లకు రూ.6,859, మొక్కజొన్నకు రూ.2,330, ఆ ముదాలకు రూ.5,070, పత్తికి రూ.6,789 ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.