కేటీదొడ్డి, ఏప్రిల్ 1 : వందరోజుల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుందని, ఇది సహజంగా వచ్చినది కాదు.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని, కేసీఆర్ అద్భుతంగా మా ర్చిన పంట పొలాలను బీళ్లుగా చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కేటీదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో ఎండిన పం టలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మె ల్యే వద్ద తమ గోడును వినిపించి ఆదుకోవాలని వేడుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎ క్కడికక్కడ పంటలు ఎండుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఎండిన పంటలపై కనీసం స మీక్ష కూడా చేయడం లేదన్నారు. మంత్రులు ఏసీ కా ర్లల్లో తిరుగుతూ రైతుల బాధలు పట్టించుకోవట్లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం అంటేనే అద్భుతం అనుకునేవాళ్లమని, ఇలాంటి రోజు రైతులకు వస్తుందని అనుకోలేదన్నారు. ప్రతిపక్ష నాయకులం రైతుల బాధలు తెలుకోవడానికి పోతుంటే కూ డా హేళన చేసి మాట్లాడుతున్నారని వాపోయారు. ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులపై చూపడం లే దన్నారు. ఆయనకు ఢిల్లీకి తిరగడంతోనే సగం సమ యం సరిపోయిందని ఎద్దేవా చేశారు.
గ్రామాల్లో కనీ సం తాగడానికి కూడా నీళ్లు లేవన్నారు. గతంలో తాగునీటి సమస్య తలెత్తకూడదని తాము కర్ణాటక రాష్ట్రం నుంచి నీళ్లు తెచ్చామని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారని.. ఇన్ని సమస్యలు ఉంటే రైతులు, ప్రజలు ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం రైతుబంధు కూడా ఇవ్వడానికి చేత కాదా అని అన్నారు. ఎకరం వరి పండించడానికి పెట్టుబడి కోసం సుమారు రూ.30 వేల వరకు ఖర్చు అవుతుందని, ఇప్పుడు చేతికొచ్చిన పంటలు ఎండితే వారి పరిస్థితి ఏంటన్నారు. రాష్ట్రంలో సుమారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇవి ఆత్మహత్యలు కావని ప్రభుత్వం చేసిన హత్యలే అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ అధికారులతో ఎండిపోయిన పంటల వివరాలు సేకరించి ఎకరాకు పంట న ష్టం కింద రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉరుకుందు, నాయకులు చక్రధర్రావు, హనుమంతు, గోవిందు, యుగేంధర్గౌడ్, వెంకన్గౌడ్, వీరేశ్, గోపి, రాజేశ్, జాంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.