అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో నారీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి తినిపించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఉమెన్స్ డే విషెస్ తెలియజేశారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, మార్చి 8
మహబూబ్నగర్, మార్చి 8: మహిళలకు అన్ని విధాలుగా సముచిత స్థానం కల్పించడంలో ముందుంటామని కలెక్టర్ రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో శిశు, మహిళా అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహా, అదనపు కలెక్టర్ సీతారామారావు, అధికారులు సంతకం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు గతేడాది సాధించిన విజయాలు, మునుముందు నిర్వహించే కార్యక్రమాలపై చర్చించేందుకు మహిళా దినోత్సవం వేదిక లాంటిదన్నారు. మహిళలు బాలికల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా, వడ్డీలేని రుణాలు తదితర కార్యక్రమాలను జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రారంభించడ లేదని తెలిపారు. కోడ్ ముగిసిన వెంటనే అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని పేర్కొన్నారు.
మహిళ స్త్రీశక్తి స్వరూపిణీ : ఎస్పీ
మహిళ స్త్రీశక్తి స్వరూపిణీ అని ఎస్పీ నరసింహా అన్నారు. ప్రపంచంలో సగభాగానికి పైగా మహిళలే ఉన్నారని, ఎన్నోరంగాల్లో ముందుండి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళల సంరక్షణకు జిల్లాలో మహిళా పోలీస్స్టేషన్, షీటీమ్స్, సఖి కేంద్రం నిర్వహిస్తున్నామని, మహిళా, శిశు సంక్షేమశా ఖ సహకారంతో మహిళల రక్షణకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఎవరై నా సైబర్ మోసాలకు గురైనట్లు ఉం టే 1930 నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. అనంతరం సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ, అడిషనల్ పీడీ శారద, మత్స్యశాఖ ఏడీ రాధారోహిణి, వెనకబడిన జిల్లా సంక్షేమాధికారి ఇందిర, డీఆర్డీవో యాదయ్య, డీఎంహెచ్వో కృష్ణ, డీడబ్ల్యూవో జరీనాబే గం, మహిళా అధికారిణీలు, మహిళలు పాల్గొన్నారు.