పాలమూరులో 265 మీటర్ల పొడవు, 5 ఫీట్ల వెడల్పుతో సస్పెన్షన్ బ్రిడ్జి, ట్యాంక్బండ్ మధ్యలో సుమారు ఎకరా స్థలంలో ఐలాండ్(దీవి) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ వద్ద రూ.14కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల రూ.25కోట్లతో నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. పాలమూరు పేరు్ర పఖ్యాతలు మరింత ఉన్నతస్థాయికి తీసుకొచ్చేందుకుగానూ మినీ ట్యాంక్బండ్ తలమానికంగా మారుతుందన్నారు.
చేతికొచ్చిన పంట నేలపాలు అకాల వర్షం..తడిసిన ధాన్యం
నవాబ్పేట, మే 17: మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వివిధ గ్రామాల్లో రైతుల ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. రుద్రారం, నవాబ్పేట, యన్మన్గండ్ల, కారుకొండ, ఇప్పటూర్, కామారం, లోకిరేవు, లింగంపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో ధాన్యం తడిసింది. ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోగా…చెట్లు విరిగిపడ్డాయి.
జడ్చర్లలో 3.8మిల్లీమీటర్ల వర్షం
జడ్చర్ల, మే 17: జడ్చర్లలో మంగళవారం సాయంత్రం 3.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అకాల వర్షానికి జడ్చర్ల పత్తి మార్కెట్లోని ధాన్యం కుప్పలు తడిశాయి. కొందరు రైతులు ముందుగానే ధాన్యం కుప్పలపై కవర్లు కప్పేశారు. వర్షంతో వరికోతలకు కొంత ఇబ్బందులు కలగనున్నది.
పిడుగుపాటుకు 8 మేకలు మృత్యువాత
రాజాపూర్, మే 17: మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం రావడంతో ఆరపోసిన ధాన్యం తడిసిముద్దయింది. కోతకు వచ్చిన పంట నేలకు ఒరిగింది. కల్లేపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 8మేకలు మృతి చెందడంతోపాటు మేకల కాపరి శ్రీనివాస్ అస్వస్థకు గురయ్యాడు. శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.