జడ్చర్ల, డిసెంబర్ 27 : వానకాలానికి సంబంధించి ప్ర భుత్వం రైతుల నుంచి ధాన్యంను కొనుగోలు చేస్తున్నది. ఈసారి ధాన్యం కొనుగోలును కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకుగానూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి నుం చి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వానాకాలం సీజన్కు సం బంధించి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. వానకాలంలో వర్షాలు బాగా కురవడంతో రైతులు అధికంగా వరి సాగు చేశారు. గతంలో కంటే ఈసారి పంట దిగుబడులు కూడా బాగా పెరిగాయి. అందుకు తగినట్లుగా గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 195 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఈసారి జిల్లా కు చెందిన ధాన్యం నాణ్యతగా ఉండడంతోపాటు సన్నాల కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సన్నరకం ధాన్యా న్ని రైతులు అధిక ధరలకు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యా పారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో ధరలు పెరిగా యి. కొంతమంది వ్యాపారులు రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి కొ నుగోళు చేశారు.
సన్నాలకు ధరలు అధికంగా లభిస్తుండడం తో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా నేరుగా మార్కెట్కు తీసుకెళ్లా రు. ప్రభుత్వ మద్దతు ఏ గ్రేడు ధాన్యానికి ధర క్వింటాకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 నిర్ణయించడం జరిగింది. అంతర్రాష్ట్ర మార్కెట్లో సన్నరకం ధాన్యానికి మంచి డిమాం డ్ ఉండడంతో వ్యాపారులు పోటీ ప డి క్వింటాల్కు రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ధరలు చెల్లిస్తూ కొ నుగోలు చేపట్టారు. ఎప్పుడు లేని వి ధంగా సన్నరకం ధాన్యానికి రికార్డు ధ ర లభించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అంతంగానే వచ్చింది. ప్రభుత్వం అ నుకున్నంతగా ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాలేదు.
నిర్ణయించుకున్న లక్ష్యాని కంటే తక్కువ మొత్తంలో ధాన్యం వచ్చిం ది. జిల్లాలో 2,50,000వేల టన్నుల ధాన్యానికి సేకరించేందుకు లక్ష్యం నిర్ణయించుకోగా మార్కెట్లో ధాన్యానికి మం చి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. జిల్లాలో 195 ప్రభుత్వ కొనుగో లు కేంద్రాల నుంచి 24,986మంది రైతులతో 1,35,000 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి కొనుగోలు చేసింది. రూ.2 67కోట్ల విలువైన ధాన్యానికి కొనుగోలు చేయడం జరిగిం ది. ధాన్యానికి విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు రూ. 249కోట్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అంటే 98.8శాతం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అక్కడక్కడ రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యానికి వారం రోజుల్లో కొనుగోలు చేయనున్నారు. దీంతో కొనుగోళ్లు పూర్తి కానున్నాయి.
వారంలో కొనుగోళ్లు పూర్తవుతాయి
వానకాలంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసింది. అందుకోసం జిల్లా వ్యాప్తంగా 195 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటి నుంచి ఇప్పటి వరకు 24,986మంది రైతుల నుంచి 1,35,000వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి కొ నుగోలు చేయడం జరిగింది. రూ.267కోట్లు ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.249కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. దాదాపు 98.8 శాతం డబ్బులు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. మిగతా డబ్బులు వారం రోజుల లోపు రైతుల ఖాతాల్లో జమ చే స్తాం. వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయి.
-జగదీశ్, డీఎం మహబూబ్నగర్