బిడ్డకు జన్మనివ్వాలంటే ఆ తల్లికి పునర్జన్మే.. అందుకే భయంతో జనం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించి ఆర్థిక కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సర్కార్ దవాఖానల్లో ప్రసవానికి భరోసా కల్పించారు. సుఖ ప్రసవాలు జరిగి తల్లీబిడ్డా క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు చేపట్టారు. ఇదే కోవలోకి వనపర్తి దవాఖాన చేరుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కృషితో జిల్లాకే్ంరద్రం సమీపంలోని నర్సింగాయపల్లి వద్ద వైద్యశాలను నిర్మించారు. మాతా శిశువు ఆరోగ్య కేంద్రాన్ని గతేడాది జనవరి 25న మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి నేటి వరకు రికార్డు స్థాయిలో కాన్పులు చేస్తూ గర్భిణులకు మేమున్నామంటూ ధైర్యం కల్పిస్తున్నారు. ఇక్కడ సూపర్ వైద్య సేవలు అందుతుండడంతో నిత్యం బారులుదీరుతున్నారు. అందుకే ప్రారంభమైనపది నెలల్లోనే 1,452 సాధారణ ప్రసవాలు.. 1,740 సిజేరియన్లు జరిగాయి. మొత్తం 3,192 మంది గర్భిణులు చికిత్సలు పొందారు. గైనిక్ లో రోజు వారీగా ఓపీ 23,709 రోగులకు, 20,946 మంది చిన్నారులకు సేవలు అందించడంతోపాటు 2,656 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
వనపర్తి, జనవరి 22 : గతంలో సర్కారు ద వాఖానలో ఎర్రగోలి, పచ్చగోలి తప్పా ఆపరేష న్లు చేయరు.. పెద్ద రోగం వచ్చిందని పోతే వేరే చోటకు రెఫర్ చేస్తారు.. ఒకవేళ వైద్యం అందించినా మంచిగా చూసుకుంటారో లేదో అన్న అ నుమానం ఉండేది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సా రించారు. కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి కార్యక్రమాలకు నాంది పలికి.. ప్రజలు సర్కార్ దవాఖానలకు క్యూ కట్టే స్థాయికి తీసుకొచ్చారు. అంతేకాకుండా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలకు తీర్చిదిద్దడంతో ప్రైవేట్కు వెళ్లేవారు కూడా సర్కార్కే మొగ్గు చూపుతున్నారు.
అండగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం..
వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి శివారులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ.17 కో ట్లతో నిర్మించిన కేంద్రాన్ని గతేడాది జనవరి 25వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు రికార్డు స్థాయిలో కాన్పులు చేస్తూ గర్భిణులకు అండగా నిలుస్తున్నారు. వై ద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. 10 నెలల్లోనే 1,740 నార్మల్ డెలివరీలు, 1,452 సిజేరియన్లు.. మొత్తం 3,192 కాన్పులు చేశారు.
23,709 మంది గర్భిణులు, 20,946 మంది చిన్నారులకు ఓపీ సేవలను అందించడంతోపాటు 2,656 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ నెల 19వ తేదీన 24 గంటల్లో 26 డెలివరీలను చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. ఇందులో 15 నార్మల్ డెలివరీలు ఉన్నాయి. వాటిలో 9 మొదటి కాన్పు ఉండడం విశేషం. రిస్క్ కేసులను సైతం చూస్తున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు, పిల్లలకు ల్యాబ్లో టెస్టులను చేస్తున్నారు. ఇటీవల టిఫ్పా కేంద్రం కూడా ప్రారంభం కావడంతో గర్భిణులకు స్కానింగ్ చేయడంతో నిత్యం కిటకిటలాడుతున్నది. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానల్లో క్రమంగా ప్రసవాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
ప్రైవేట్ దవాఖానల్లో..
గతంలో మహిళలకు ప్రైవేట్ దవాఖానల్లో కూడా నార్మల్ డెలివరీలు జరిగేవి. మారుతున్న కాలానుగుణంగా సహజ కాన్పుల కన్నా సిజేరియన్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. పేద, ధనిక బేధాభిప్రాయాలు లేకుండా సహజ కాన్సులను చాలా వరకు తగ్గించారు. నార్మల్ డెలివరీలకు మందులతో కలిపి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు అవుతుంది. అదే సిజేరియన్కు అయితే రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు దండుకుంటున్నారు. ప్రజల జేబులకు చిల్లులు పెట్టేందుకే సిజేరియన్లు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం..
ప్రభుత్వ దవాఖానలకు చాలా వరకు పేదలే వస్తుంటారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. డాక్టర్లు, సిబ్బంది దవాఖానకు వచ్చే వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నాతోపాటు మరో ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి సైతం అందుబాటులో ఉంటారు. 24 గంటలు అన్ని రకాల సేవలందిస్తున్నాం. హై రిస్క్ కేసులను సైతం ఇతర దవాఖానలకు రెఫర్ చేయకుండా ఇక్కడే వైద్యాన్ని అందిస్తున్నాం. ఈ నెల 19వ తేదీన ఒక్క రోజులోనే 26 డెలివరీలను చేశాం.
– డాక్టర్ కిరణ్మయి, ప్రొఫెసర్, హెచ్వోడీ, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, వనపర్తి
చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి చాలా మంది గర్భిణులు, పిల్లలు వస్తుంటారు. ఇక్కడే డెలివరీలు కావడం, రోజుల శిశువులు ఉండడం వల్ల శానిటేషన్ మంచిగా లేకుంటే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అలాంటి అవకాశం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దవాఖాన ఆవరణంతా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంతోపాటు అక్కడక్కడ చెత్త డబ్బాలను ఏర్పాటు చేశాం. వైద్యానికి వాడే సిరంజులు, ఇతర బయోమెడికల్ వేస్టేజ్ను వేర్వేరుగా పెట్టి చెత్త ట్రాక్టర్లో వేస్తున్నం. దీంతో దవాఖాన అంతా శుభ్రంగా ఉంటున్నది.
– బి.బంగారయ్య, ఆర్ఎంవో, మాతాశిశు ఆరోగ్య కేంద్రం
రెండో కాన్పునకు వచ్చా..
మొదటి కాన్పును వనపర్తిలోని ప్రైవేట్ దవాఖానలో చే యించుకున్నాను. రెండో కాన్పు కోసం మాతాశిశు ఆరోగ్య కేం ద్రానికి వచ్చాను. మొదటి కా న్పు సిజేరియన్ కావడంతో రెం డో కాన్పు కూడా సిజేరియన్ అయ్యింది. ఇక్కడ డాక్టర్లు చాలా మంచిగా వైద్యం చేశారు. సదుపాయాలన్నీ బాగున్నాయి. ప్రైవేట్కు వెళ్లి డబ్బులు ఖర్చులు పెట్టుకోకుండా ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా చేయించుకున్నాను. చాలా డబ్బులు మిగిలాయి.
– విజయమ్మ, గోప్లాపూర్ తండా, పాన్గల్ మండలం
పాపకు త్వరగా నయం చేశారు..
నాకు మొదటి కాన్పు సిజేరియన్ కాగా పాప 2.3 కేజీలతో పుట్టింది. ఉమ్మునీరు బాగా మింగడంతో పరిస్థితి సీరియస్గా ఉన్నది. అయినా ప్రైవేట్ దవాఖానలకు రెఫర్ చేయకుండా ఇక్కడి డాక్టర్లు నయం చేశారు. చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను, నా బిడ్డ మంచిగా ఉన్నాం. అంతా డాక్టర్ల దయ. సీఎం కేసీఆర్ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో ప్రైవేట్కు వెళ్లకుండా ఇక్కడే నయమైంది.
– ప్రత్యూష, చిట్యాల పెద్దతండా, వనపర్తి మండలం
స్కానింగ్ ఉచితంగా చేస్తున్నారు..
మొదటి కాన్పు సమయంలో వనపర్తిలోని ప్రైవేట్ సెంటర్లో స్కానింగ్ చేయించుకున్నాను. వందల రూపాయలు ఖర్చయ్యేవి. ఏదో ఒక ప్రాబ్లం చెప్పేవారు. పొద్దుగాల వెళ్లి టోకెన్ తీసుకుంటే ఒక్కోసారి సాయంత్రం అయ్యేది. అంతసేపు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు రెండో కాన్పు సమయంలో ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా స్కానింగ్ తీస్తున్నారు. డబ్బులు ఆదా అవుతున్నాయి.
– లక్ష్మి, పాలెం, కొత్తకోట మండలం