ఉప్పునుంతల, ఏప్రిల్ 20 : సుస్థిర పాలన అందించడమే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం మండలంలోని సదగోడులో ఉన్న ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్రావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి విప్ గువ్వల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచామన్నా రు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, దేశమంతా కేసీఆర్ వైపు చూస్తున్నదన్నారు. గత పా లకుల చేతిలో తెలంగాణ ఆగమైపోయిందని, కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అచ్చంపేట నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామన్నారు. రూ.200 కోట్ల తో పనులు చురుకుగా జరుగుతున్నాయని, ప్రాణం ఉన్నంత వరకు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. అందరం కేసీఆర్ కుటుంబసభ్యులమని, చిన్న చిన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకుందామన్నారు. అభిమానం, ఆప్యాయత, అనురాగం పంచుకునేందుకే సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ముచ్చటగా మూడోసారి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
ప్రజల నుంచి పార్టీని దూరం చేసే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. కొన్ని సమయాల్లో కోపగించుకున్నా.. అవేవీ పట్టించుకోకుండా స హకరిస్తున్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ రాములు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందని కుటుంబమే లేదన్నారు. 70 ఏండ్లు పాలించిన కాం గ్రెస్ పార్టీ నాయకులు చేసిందేమీ లేదని, ఇప్పు డు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదమన్నా రు. 350 మంది ఎంపీలున్న బీజేపీ.. దేశానికి చేసిన ఒక్క పనికూడా లేదని, ఏ బిల్లు మీద చర్చ లేదన్నారు. కేంద్రం మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోయినా.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 17 కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ మొండి చెయ్యి చూపుతున్నదని, బీజేపీ చెవిలో పూలు పెడుతున్నదన్నారు. కేసీఆర్ పాలనలో ఎంపీగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో సైనికులుగా పనిచేయాలని సూచించారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో పార్టీ బలీయమైన శక్తిగా ఉందన్నారు. సమ్మేళనంలో ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనం ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్లో చేరిక..
మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన కాం గ్రెస్ నాయకులు విప్ గువ్వల, ఎమ్మెల్సీ కశిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సింధు రమేశ్, ఈశ్వరయ్యతోపాటు 20 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ భూపాల్రావు, పాలశీతలీకరణ కేంద్రం చైర్మన్ గోపాల్రెడ్డి, సర్పంచులు బాలూనాయక్, శ్రీనివాసులు, పర్వతాలు, స్వర్ణలత, శిరీష, ఎంపీటీసీ కవిత, శివ, శ్రీహరి, రంగారెడ్డి, తిరుపతిరెడ్డి, జహంగీర్, రఘుమారెడ్డి, సుమన్, నాగయ్యగౌడ్ ఉన్నారు.