వంగూరు డిశంబర్ 11: అన్నివర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని, అందుకనుగునంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. వంగూరు మండలం నిజాంబాద్లో ఆదివారం 100మంది కాంగ్రెస్ నాయకులు విప్, ఎమ్మెల్యే గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి విప్ గువ్వల గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ సంస్థలతో విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతుందన్నారు.
వారు ఎన్ని దాడులు చేసినా బీఆర్ఎస్ భయపడే ప్రసక్తి లేదన్నారు. దేశ ప్రజలను పీడిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను జాతీయస్థాయిలో బీఆర్ఎస్గా మార్చి దేశ ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిజాంబాద్లోని కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. అలాగే గ్రామంలో నిర్మించే ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.5లక్షలు, సీసీరోడ్లు మంజూరు చేయనున్నట్లు విప్ గువ్వల తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు పద్మ, బాలస్వామి, మాసయ్య, వెంకట్రాములు, రాంచందర్, పెద్ద సాయిలు, జానయ్య, చిన్న జానయ్య, భారతమ్మ, సుగుణమ్మ, సూర్యకళ, లాలమ్మతోపాటు 100మంది చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలస్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్విండో చైర్మన్ సురేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నారాయణరావు, జెడ్పీ కోఆప్షన్ హమీద్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అంజి, మార్కెట్ డైరెక్టర్ రాజేందర్రెడ్డి, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, నాయకులు వెంకటేశ్వర్రావు, ఆనంద్రెడ్డి, శ్రీపతిరావు, ముఖేశ్, రాజు, రమేశ్, సురేశ్యాదవ్, అంజియాదవ్, మసూద్ పాల్గొన్నారు.