రాష్ట్రంలోని సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో సంపన్నులకే అందే ఖరీదైన వైద్యం నేడు పేదల చెంతకు చేరింది. పాలమూరులోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో మోకీలు మార్పిడి ఉచితంగా చేస్తున్నారు.ఈ ఆపరేషన్లు తెల్లరేషన్, ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా, లేకున్నా ఉచితంగా నిర్వహిస్తున్నారు.ప్రతి గురువారం మోకీలు సమస్యలపై దవాఖానలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 25 మందికి మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో సర్కార్ వైద్యంపై పేదలకు భరోసా పెరిగింది. పైసా ఖర్చు లేకుండా చేస్తున్న ఆపరేషన్లపై ఆనందం వెల్లువిరుస్తున్నది.
మహబూబ్నగర్ మెట్టుగ డ్డ, ఫిబ్రవరి 14 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. కూలి పనులతోపాటు వ్యవసాయం, పరిశ్రమ లు, ఇతర వ్యాపారాల్లో కార్మికులుగా పనిచేస్తుంటారు. అయితే, జిల్లా జనాభాలో దాదాపు 60 శాతం మంది మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బా ధపడుతున్నారు. ఒకప్పుడు 50 ఏండ్లు పైబడిన వారికి ఈ సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం 35 ఏండ్ల నుంచే ఈ నొప్పులతో సతమతమవుతున్నారు. ఎక్కువగా లేచి కూర్చునే పనులు చేయడం, మెట్లు ఎక్కడం, వ్యాయమం లేకపోవడంతో కీళ్లు, కండరాలు పట్టేస్తున్నాయి. దీంతో ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఫిల్టర్ నీళ్లకు అలవాటుపడడం కూడా ఒక కారణమని వై ద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫిల్టర్ నీళ్లల్లో కెమికల్ కలుపుతున్నారని, అ వి తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నా రు. కాగా, సంపన్నులు రూ.లక్షలు వెచ్చించి మో కీలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేవారు. ఇ ప్పుడు సర్కార్ దవాఖానల్లో ఉచితంగా వైద్యం అందుతున్నది.
మహబూబ్నగర్ ప్రభుత్వ జనర ల్ దవాఖానలో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అందుబాటులో ఉన్నది. ఈ సర్జరీలను ఆరోగ్యశ్రీ కింద చే యాలని ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం ఒక్కో రోగికి రూ.80 వేలు ఖర్చు చేస్తున్నారు. మూడు నెలల నుంచి మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో సేవలందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలు కూడా వైద్యం కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేందుకు ప్రైవేట్ దవాఖానల్లో ఒక్కో కాలికి రూ.1.50 లక్షల చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా శస్త్రచికిత్స చేస్తున్నారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కోసం అవసరమైన మిషన్లను రూ.50 లక్షలతో కొనుగోలు చేశారు.
ఉచితంగా ఆపరేషన్.. మహబూబ్నగర్
ప్రభుత్వ జనరల్ దవాఖానలో వైద్యులు రూపాయి తీసుకోకుం డా మోకీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. ప్రైవేట్కు వెళ్తే రూ. 1.50 లక్షలు అవుతుందన్నా రు. ప్రభుత్వ దవాఖానలో మె రుగైన వైద్యసేవలందించారు. నా కుడికాలి మోకీలుకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన వారం రోజుల్లో డిశ్చార్జి చేసి మందులు ఉచితంగా అందజేశారు. ఈ చికిత్సతో చాలా మందికి లబ్ధి కలుగుతుంది.
– లక్ష్మీదేవి, పెంట్లవెల్లి, నాగర్కర్నూల్ జిల్లా