మక్తల్ రూరల్, మే 18: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్నారు. మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం టగ్ ఆఫ్ వార్, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖోఖో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందని, క్రీడాకారులకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు ప్రతి మండలానికి మినీ స్టేడియం నిర్మిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తయారుచేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి శిక్షణా శిబిరాల్లో విద్యార్థులు శిక్షణ పొంది క్రీడా నైపుణ్యతను చాటుకోవాలని కోరారు. మక్తల్లో విశ్రాంత పీఈటీ గోపాలం ఆధ్వర్యంలో ఏటా వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ కొనియాడారు. క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. టగ్ ఆఫ్ వార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం మాట్లాడుతూ స్థానిక మినీ స్టేడియంలో ప్రారంభించిన ఖోఖో శిక్షణా శిబిరం జూన్ 12వరకు నిర్వహిస్తామన్నారు. మక్తల్ ప్రాంతంలోని బాలబాలికలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, లక్ష్మణ్, రమేశ్రావు, ప్రభాకర్రెడ్డి, పీఈటీలు దామోదర్, రమేశ్, శ్రీలత, రామకృష్ణ, వెంకటేశ్, జయమ్మ, రేణుక, శృతి, రాశి, తదితరులు పాల్గొన్నారు.
పోలీసు శిక్షణకు మెటీరియల్ పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న ఐదుగురు మహిళలకు బుధవారం డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా మెటీరియల్ పంపిణీ చేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మక్తల్కు చెందిన శృతి, రాశి, రేణుక, మంజుల, మౌనిక శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కొక్కరికి రూ.5వేలు విలువగల బుక్స్, మెటీరియల్ అందజేశారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.