ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ అడుగులు వేస్తున్నది. అన్ని పండుగలకూ ప్రాధాన్యమిస్తున్నది. పేదలు సంతోషంగా పర్వదినాలను జరుపుకోవాలనే ఉద్దేశంతో కానుకలను అందిస్తున్నది. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ గిఫ్టులను ఇస్తున్నది. 25న క్రిస్మస్ను పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లాకు 3 వేల కానుకలు చేరాయి. పాలమూరు, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని తాసిల్దార్లకు మైనార్టీ సంక్షేమ అధికారులు అందజేశారు. వీటిని గోదాముల్లో భద్రపరిచారు. మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనుండగా.. పేద క్రైస్తవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 7 : రాష్ట్రంలోని అ న్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ముస్లింలకు రంజాన్ తో ఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్టులను ఏటా పంపిణీ చే స్తున్నది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగకూ కానుకను అందించాలని నిర్ణయించింది. అందుకోసం పేద క్రైస్తవులకు బ హుమతులు అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో ని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల మూడు నియోజకవర్గాలకు మొత్తం 3 వేల గిఫ్టులు చేరాయి. వీటిని ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని తాసిల్దార్లకు మైనార్టీ సంక్షే మ శాఖాధికారులు అందజేశారు. వీటిని మండలాల వారీ గా అధికారులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్స్ కమిటీ (సీసీవోసీ) ఆధ్వర్యంలో చర్చిల నిర్వాహకులు గుర్తించిన పేదలకు పంపిణీ చేయనున్నారు.
సీఎం కేసీఆర్ అందరివాడిగా చరిత్ర సృష్టిస్తున్నాడు. అ న్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ మన్ననలు పొందుతున్నారు. అన్ని మతాల ప్రజలు వారి పండుగలతో సంతోషంగా జరుపుకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మతాల వారి ప్రార్థనా మందిరాలను ఆధునీకరించేందుకు సైతం నిధులు విడుదల చేస్తున్నారు.
జిల్లాలోని 3 వేల మంది అత్యంత పేద క్రైస్తవులకు సీఎం కేసీఆర్ గిఫ్ట్ ప్యాకులను అందించనున్నారు. ఈ ప్యా కెట్లో ఒక చీర, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్టు ఉన్నాయి. కుటుంబంలోని తల్లిదండ్రులకు, కుమారైకు ఈ దుస్తులు ఇవ్వనున్నారు. క్రిస్మస్ పండుగ రోజు కొత్త బట్టలు కొనుక్కోలేని పేదలకు ఈ కానుక వరంగా మారింది.
క్రైస్తవులకు పంపిణీ చేసే కా నుకలు జిల్లాకు చేరాయి. కలెక్ట ర్ వెంకట్రావు ఆదేశాల మేరకు వాటిని అందించేందుకు ఆయా నియోజకవర్గాల కేంద్రాలకు పంపిస్తాం. క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీ గుర్తించిన పే దలకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాలను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
– శంకారాచారి, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి