వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
ఘనంగా రాజరాజేశ్వరి స్వామి విగ్రహ ప్రతిష్ఠ
వనపర్తి రూరల్, జూన్ 24 : నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఆలయం మనిషికి సన్మార్గాన్ని చూపిస్తుందన్నారు. ఆలయ గోపురం మనిషిలోని అహాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఎంతటి వారైన ఆల య ప్రవేశంతో వారిలో సద్గుణాన్ని కల్గిస్తుందన్నారు. రాజపేటలో ప్రత్యేకత చాటేలా ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమన్నారు.
ప్రజలు గ్రామాభివృద్ధిలో కలిసికట్టుగా అడుగులు వేయాలన్నారు. అనంతరం మం త్రిని స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. అలాగే వేదపండితుల మం త్రోచ్ఛారణలతో విగ్రహ, బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపు వెళ్లి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సర్పంచ్ జ్యోతి మాధవరెడ్డి, రవీందర్గౌడ్, విజయలక్ష్మి, మురళీగోపాల్రెడ్డి, రఘునాథ్రెడ్డి, సంపత్ కుమార్రెడ్డి, సుదర్శన్రెడ్డి, వేమారెడ్డి, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.