నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శిస్తే నాయకులవుతారా అంటూ ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్తో కలిసి బుధవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత రాహుల్గాంధీకి లేదన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ,రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ.. ఇలా మీరం తా ఒక్క కుటుంబం కాదా అని పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేసి వందలాది మంది చావులకు కారణమైన కాంగ్రెస్కు రాష్ట్రంలో చోటు లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ, మైనార్టీలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారన్నారు. డిపాజిట్లు గల్లంతయ్యే మీరు అధికారంలోకి వస్తామనిపగటి కలలు కంటున్నారన్నారు. రాహుల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మా నాయకుడు గల్లీలో ఉంటే.. మీ నాయకుడు ఢిల్లీలో ఉంటాడన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నూ బీఆర్ఎస్దే హ్యాట్రిక్ విజయమన్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 1 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను తిడితే నాయకులవుతారా అంటూ ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎ మ్మెల్యే ఎర్రశేఖర్తో కలిసి బుధవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబ పాలనపై రాహుల్గాంధీ మాట్లాడ డం విడ్డూరంగా ఉందని.., ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చాడో చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. మీ తాత ముత్తాతల నుంచి నీకు రాజకీయ వారసత్వం వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ.. ఇలా మీరంతా ఒక్క కుటుంబం కాదా అని పేర్కొన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా స్వరాష్ట్రం కోసం శ్రమించిన సీఎం కేసీఆర్ కు టుంబ సభ్యులు రాజకీయల్లో ఉంటే తప్పేముందన్నా రు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటే.. తమ నా యకుడు, ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ గల్లీలో ఉన్నారనే విషయాన్ని గమనించాలన్నారు. తామే వస్తాం.. ఏదో చేస్తాం.. అంటూ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాసిచ్చిన స్రిప్ట్ చదువుతున్న రాహుల్గాంధీకి ఇక్కడ జరిగే విషయాలెలా తెలుస్తాయన్నారు. ఆయన ఒక రీడర్లాగా పనికివస్తారన్నారు.
రూ. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని మాట్లాడుతున్న రాహుల్ను చూస్తే జాలి కలుగుతున్నదన్నారు. 1969 ఉద్యమ సమయం లో తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం ఇచ్చినట్లే ఇచ్చి ఆలస్యం చేసి అనేక మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాం గ్రెస్, బీజేపీ తప్పా వేరే పార్టీ ఉండకూడదన్నదే వారి కుటిల ప్రయత్నమన్నారు. అందులో భాగంగానే బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి మహబూబ్నగర్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇ వ్వనని అసెంబ్లీలో తెగేసి చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ ము ఖ్యమంత్రి కాదా అని ప్రశ్నించారు. హంద్రినీవా, పో తిరెడ్డిపాడు, ఆర్టీఎస్ నుంచి అక్రమంగా నీటిని తరలించి తెలంగాణను ఎండెట్టిన వారికి అధికారం ఎలా ఇ స్తామన్నారు. రాహుల్గాంధీ పొర్లిపొర్లి దండాలు పెట్టి నా ప్రజలు నమ్మరన్నారు. ప్రాణాలు లెక్కచేయకుండా ఉద్యమం చేసిన పార్టీకి భయం అనేదే లేదన్నారు. ద ర్శకుడు దాసరి తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలాగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని.. అనేక మంది ము ఖ్యమంత్రి ఆశావహులు ఉన్న పార్టీలో పగటి కలలు కం టున్నారన్నారు. కిరాయి సర్వేలతో ఎలాంటి ఉపయో గం లేదని, ప్రజలకు మంచి చేయాలనే తపనతో బీఆర్ఎస్ నిరంతరం శ్రమిస్తుందన్నారు. వ్యక్తులను కొనొచ్చు కానీ ఓటర్లను కొనలేరన్నారు. మంచి చేసిన బీఆర్ఎస్ వైపే ప్రజలంతా ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ప్రజలు, నాయకులను మోసం చేసేందుకని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ తెలిపారు. వారి చేతుల్లో మోసపోయిన తానే ఒక ఉదాహరణ అని అ న్నారు. రాష్ట్రంలో బీసీలు బలంగా ఉన్న చోట టికెట్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఎక్కడైతే ఓడిపోతారో అక్కడ మాత్రమే బీసీలకు సీట్లు ఇస్తున్నదంటూ మండిపడ్డారు. బీసీవాదం లేదని చెప్పేందుకే ఇలాంటి కుటిల యత్నాలు చేస్తున్నదన్నారు. జ డ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడి శ్రమించిన నాయకులను కాదని.. డబ్బులు తీసుకొని అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించిందన్నారు. రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వంటి నాయకులు ఉ న్నంత వరకు బజారులో కూరగాయల్లాగా టికెట్లు అ మ్ముకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకు లకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపుని చ్చారు. ముదిరాజ్ సామాజికవర్గ ప్రజలు ఆర్థి కంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సీ ఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ వెంకన్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయలు రామకృష్ణ, పాషా తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 1 : పదేండ్లల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ చేసిన అభివృద్ధిని చూసి.. తాము కూడా భాగస్వాములయ్యేందుకు బీఆర్ఎస్లోకి వ చ్చామని ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బా బుల్రెడ్డి తెలిపారు. ఆమ్ఆద్మీ ప్రధాన కార్యదర్శి వెం కటేశ్, శ్రీనివాస్కుమార్, సతీశ్రెడ్డి, రాములు, బాల్రె డ్డి, రఘు, శ్రీనివాస్రెడ్డి, శేఖర్, సాబేర్తోసహా 200 మంది.., అలాగే బీజెపీ, కాంగ్రెస్ నాయకులు నయీమ్ ఆధ్వర్యంలో 300 మంది మంత్రి సమక్షంలో బీఆర్ ఎస్లో చేరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాంలక్ష్మణ్, నాయకులు నటరాజు, షబ్బీర్, రమణయ్య ఉన్నారు.
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 1 : మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మరింత డెవలప్ చేయడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీలోని న్యూమోతీనగర్, న్యూగంజ్, క్రిష్టియన్పల్లి, ఓల్డ్మోతీనగర్, పోచమ్మ టెంపుల్ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. సంజయ్నగర్లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఎక్కడ నష్టం జరుగుతుందో అక్కడ తాను ఉంటానన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సింహులు, నాయకులు రషీద్ఖాన్, ఖాజాపాషా, బాబుల్రెడ్డి, పెద్ద విజయ్కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.