అచ్చంపేట, మార్చి 9 : అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇంటిబాట పట్టారు. ఆరు వందల మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తుండగా.. పాఠశాలను సందర్శిస్తే కేవలం ముగ్గురు మాత్రమే ఉ న్నారు. విద్యార్థినులు లేక పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు నిర్మానుష్యంగా మారాయి. పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా కనిపించాయి.
ము రుగునీటి నిల్వతో దుర్వాసన వెదజల్లుతున్నది. కాగా ఘ టనతో పాఠశాల ప్రిన్సిపాల్ లలితకుమారిని సస్పెండ్ చే స్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్చార్జి ప్రిన్సిపల్గా రాజ్యలక్ష్మిని నియమించారు. ఉత్తర్వులు అందుకున్న తర్వాత లలితకుమారి పాఠశాల నుంచి తన వస్తువులు తీసుకొని వెళ్లిపోయారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. 6న సాయంత్రం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి 8 వరకు వరుస సంఘటనపై న్యాయ వి చారణ జరపాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరుసగా ఆందోళనలు చేపట్టారు. భవనానికి రంగులతోపాటు మరమ్మతులు చేపట్టినట్లు అధ్యాపక బృందం తెలిపింది. ఇంటికి వెళ్లిన విద్యార్థినులను ఫోన్లు చేసి తిరిగి రప్పించాలని ఆర్సీవో ఆదేశించారని వారన్నారు. అందరికీ ఫోన్లు చేస్తున్నామన్నారు.