తాడూరు, మే 13 : మండల కేంద్రంలోని కొమ్ముగుట్టన అయ్యప్పస్వామి విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో అయ్యప్పస్వామి ఆలయం నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక స ర్పంచ్ అనుపటి యాదమ్మా శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించడం అభినందనీయం అన్నారు.
ఆలయానికి తనవంతుగా రూ. 5లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించి నగదును గ్రామసర్పంచ్కు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, కూచకుళ్ల రాజేశ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యార రమేశ్, సర్పంచ్ అనుపటి యాదమ్మా శ్రీనివాసులు, నాయకుడు పరమేశ్వర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ ఎండీ సమద్పాషా, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రమణ, టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.