మాగనూరు డిసెంబర్ 27: మండల కేంద్రంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఈకేవైసీ చేయించుకునేందుకు రూ.200 ఎందుకు అ వసరమో చెప్పాలని గ్యాస్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ప్ర జలు బుధవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్ర భుత్వం తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలతో ముందుకు వచ్చిందని అందులో రూ.500కే ప్రజలకు సిలిండర్ అందిస్తానంటూ ప్రచా రం చేయడంతో అధికారంలోకి రాగానే ప్రజలు గ్యాస్ సిలిండర్ కేంద్రం వద్ద ఈకేవైసీ కోసం పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చే శారు.
ఈకేవైసీ చేయించాలంటే రూ.200 వసూలు చేస్తున్నారని, ఈ కేవైసీ తప్పనిసరి అనడంతో మహిళలు రూ.500 కూలి వదులుకొని సిలిండర్ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు గాస్తున్నా పని అవుతుందన్న నమ్మకం లేదని దీంతో ప్రతి ఒక్కరికీ రోజుకు రూ.700 నష్టం జరుగుతున్నదని ఆరోపించారు. అయితే జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గ్యాస్ డిస్ట్రిబ్యూటరి వారితో మాట్లాడి అందరికీ ఈకేవైసీ అయ్యేలా చూడాలని మాట్లాడడంతో వినియోగదారులు ధర్నా విరమించారు.