దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 7 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. బస్వాయిపల్లిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నినర్వహించారు. దేవరకద్రలో గురువారం గణేశ్ నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు.
భక్తులకు అన్నదానం
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 7 : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పోలీసు హెడ్క్వార్టర్స్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి ఎస్సీ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న సురక్షా పోలీసు గణపతి కమిటీని అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాసులు, మహేశ్, రమణారెడ్డి, మధు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, సెప్టెంబర్ 7 : మండలంలోని పెద్దరేవల్లిలో కొలువుదీరిన గణనాథుడికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మణికంఠ రైస్మిల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శశికాంత్రెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, మధు, శ్రీశైలం పాల్గొన్నారు.
ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం
కోయిలకొండ, సెప్టెంబర్ 7 : మండలకేంద్రంతోపాటు చింతల్తండా తదితర గ్రా మాల్లో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంకరించిన వాహనాల్లో గణనాథులకు ఊరేగింపు నిర్వహించి పెద్దవాగు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.