జోగులాంబ గద్వాల : అనుమానాస్పద స్థితిలో అపార్ట్మెంట్ పైనుంచి కిదకు దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జిల్లా కేంద్రంలో భీమ్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలో భీం నగర్ కాలనికి చెందిన జయ లక్ష్మి కొత్తగా నిర్మాణమైన హైగ్రివా అపార్ట్మెంట్ పై నుంచి కిందకి దూకి ఆత్మహత్య కు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.