జోగులాంబ గద్వాల : రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను దళార్లకు అమ్ము కోవద్దని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకు వచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఎస్ఓ రేవతి డీఎస్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.