కేటీదొడ్డి: తెలంగాణ పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉండటం మనందరి అదృష్టమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. కేటీదొడ్డి మండలానికి సంబంధించిన 51మందికి కల్యాణలక్ష్మి చెక్కులను సోమ వారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటేనే బయ పడేవారని, తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకోచ్చాడన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మనోరమ, జడ్పీటీసీ రాజశేఖర్, వైఎస్ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచ్లు పావని, ఆంజనే యులు, పార్టీ మండలాధ్యక్షుడు ఉరుకుందు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు హనుమంతు, యూత్ అధ్యక్షుడు శేఖర్రెడ్డి, నాయకులు చక్రధర్ రావు, రాజేశ్, శ్రీనివాస్గౌడ్, గోపి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.