జోగులాంబ గద్వాల : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇటిక్యాల మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పాండురంగ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు వేదిక, మన ఊరు మనబడి పథకాల అమల్లో నిర్లక్ష్యం వహించాడని, నిర్దేశించిన పనిని సకాలం లో పూర్తి చేయక నిర్లక్ష్యం వహించినందున సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.