గంజాయి సాగు చేస్తే రైతుబంధు కట్
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ముగ్గురిపై చర్యలు
గంజాయి సాగు, రవాణా చేస్తే పీడీ యాక్ట్
మత్తు పదార్థాలను రూపుమాపేందుకు అవగాహన
కఠిన చర్యలకు సిద్ధమైన ఎక్సైజ్శాఖ
మహహబూబ్నగర్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మత్తును చిత్తుగా చేసేందుకు సర్కారు నడుంబిగించింది. గంజాయి పూర్తిస్థాయి నిర్మూలనకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అంతర పంటగా గంజాయిని సాగు చేయకుండా ఉండేందుకు అవగాహన సదస్సులు నిర్వహించిన అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈక్రమంలో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ముగ్గురు రైతులకు రైతుబంధు నిలిపివేస్తూ వారిపై కేసులు కూడా నమోదు చేయాలని కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మత్తు వీడాలని, గంజాయి సాగుకు దూరంగా ఉండాలని ఎక్సైజ్, వ్యవసాయ శాఖాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గంజాయి సాగుచేసే వారిపై అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నది. అంతరపంటగా గంజాయిని సాగు చేయకుండా ఉండేందుకు అవగాహన కల్పించిన అధికారులు.. మరో అడుగు ముందుకేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజా యి సాగు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. రా ష్ట్రంలో మత్తు పదార్థాలను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అ త్యధిక కేసులు నమోదయ్యాయి. గంజాయి సాగు చేసే వారిని గుర్తించి రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జి ల్లాలో గంజాయి సాగు చేస్తున్న రైతుకు రాష్ట్రంలోనే తొలిసారి గా రైతుబంధు పథకాన్ని నిలిపివేస్తూ కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన ఇద్దరు రైతులకు రైతుబంధు నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్లో ఏ రైతు కూడా గంజా యి సాగు చేయాలనే ఆలోచనే చేయకుండా అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మత్తుకు అలవాటుపడిన వారు గంజాయి ఆకులను పొడిచేసుకొని సిగరెట్, బీడీతో కలిపి తాగుతున్నారు. పచ్చి గంజాయి ఆకులను నూరి గోలీల మాదిరిగా చేసుకొని తీసుకుంటున్నారు. గంజాయికి అ లవాటు పడితే ఆకలి మందగించడంతోపాటు నరాల బలహీ నత ఏర్పడుతుంది. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువతే ఎక్కువగా గంజాయి బారిన పడుతున్నారు. ఈ రెండు పద్ధతులే కాకుండా తర్వాత దశలో గంజాయిని ప్రాసెసింగ్ చేయ డం ద్వారా వచ్చే మత్తు పదార్థమైన వీడ్ ఆయిల్ మరింత ప్ర మాదకరం. గంజాయితో పాటు కొకైన్, హెరాయిన్ కూడా మ త్తు పదార్థాలుగా ఉన్నా.. మన ప్రాంతంలో ఆ ప్రభావం లేదు.
ముగ్గురికి రైతు‘బంద్’..
మహబూబ్నగర్ రూరల్ మండలం మనికొండకు చెందిన గనెమోని చంద్రప్పకు ఎకరన్నరలోని 11 గుంటల్లో గంజాయి సాగు చేశా డు. గతేడాది అక్టోబర్ 25న అధికారులు దాడు లు చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయాన్ని ఎక్సైజ్ సీఐ బాలకృష్ణ, ఎస్సై మొగులయ్య, తాసిల్దార్ పాం డు కలెక్టర్ వెంకట్రావుకు నివేదించారు. ఈ మే రకు చంద్రప్పకు వర్షాకాలానికి విడుదలయ్యే రైతుబంధు (రూ.7,500) నిలిపివేయాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు డీఏవో బి.వెంకటేశ్ వెల్లడించారు. అలాగే గతేడాది అక్టోబర్ 28న జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంటకు చెందిన ఎం. అంబస్వామి, ఎం.సిద్ధయ్యకు అయిజ మండ లం దేవబండ గ్రామంలో 8 ఎకరాలు ఉన్నది. కాగా ఆ పొలాన్ని బి.రామాంజనేయులు, పెద్ద రాముడు కౌలుకు తీసుకొని మిరప పంట మాటున గంజాయి సాగు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి 43 గంజాయి మొ క్కలు గుర్తించారు. శాంపిల్స్ తీసుకొని వాటిని ధ్వంసం చేశారు. ఇద్దరు రైతులు, కౌలుకు తీసుకున్న మరో ఇద్దరిపై పోలీసులు కేసులు నమో దు చేసి అరెస్టు చేశారు. సదరు రైతులకు రైతుబంధు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు సోమవారం జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి ఎం.సక్రియా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులు పొలాన్ని కౌలుకు ఇచ్చినా.. అందు లో గంజాయి సాగుచేస్తే భూ యజమానులు, రైతులపై కేసులు నమోదు చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కౌలుకు ఇచ్చేముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లో కౌలుకు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. జిల్లాలు, రాష్ర్టాల సరిహద్దుల్లో ఉండే గ్రామాల్లో గంజాయి సాగుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా దేవబండలో కౌలుకు తీసుకొని గంజాయి సాగు చేయడంతో భూ యజమానులపై సైతం కేసు నమోదుకావడంతోపాటు రైతుబంధు నిలిచిపోయింది. ఫలితంగా ఒక్కో రైతు ఏడాదికి రూ.40 వేల పంట సాయం నష్టపోయే పరిస్థితి వచ్చింది. కౌలుకు ఇచ్చేముందు ’గంజాయి సాగు చేయం.. ఒకవేళ చేస్తే పొలం యజమానిగా మీకు ఎలాంటి బాధ్యత ఉండదు.. త ప్పు చేసినందుకు ప్రభుత్వానికి రూ.5 లక్షల జరిమానా చెల్లిస్తాం’ అని అగ్రిమెంట్ రాసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గంజాయి సాగు చేసే వారిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్ 1985 యాక్ట్) ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ఆరు నెలల నుంచి 20 ఏండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సాగుచేసిన వారిపై పీడీ యాక్ట్తోపాటు క్రిమినల్ కేసులు, బైండోవర్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో గంజాయి కేసులు..
గంజాయి సాగు చేస్తున్న వారిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 8, నారాయణపేటలో 3, మహబూబ్నగర్లో 2, వనపర్తిలో 1, నాగర్కర్నూలులో 5 కేసులు నమోదయ్యాయి. చాలా చోట్ల పత్తి, మిరప పంటల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. వీరిలో పలువురు వారి సొంతానికి, విక్రయాలకు సాగు చేస్తుండగా.. మరికొందరు కేవలం పండించి ఇతర ప్రాంతాలకు తరలించి లాభాలు పొందుతున్న వారు కావడం విశేషం.
కఠిన చర్యలు తీసుకుంటున్నాం..
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు కింద ఎ కరానికి ఏటా రూ.10 వేలు అందిస్తున్నది. దీనిని సద్వినియోగం చేసుకొని రైతులు బా గుపడాలి. కానీ కొందరు అక్రమార్కులు సాయం పొందుతూనే సమాజానికి నష్టం కలిగించే గంజాయి సాగు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చ ర్య. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయిజ మండలం దేవబండలో గంజాయి సా గుచేసిన పొలానికి సంబంధించి ఇద్దరు రైతులకు చెంది న చెరో నాలుగెకరాలకు రైతుబంధును నిలిపివేశాం. భ విష్యత్లో ఏ రైతు కూడా ఇలాంటి సంఘ వ్యతిరేక కా ర్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలి.
– ఎం.సక్రియానాయక్, జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి, జోగుళాంబ గద్వాల