నారాయణపేట టౌన్, ఏప్రిల్ 9 : శ్రీరామ నవమి సందర్భంగా జిల్లాలోని రామాలయాలను నిర్వాహకులు అందం గా ముస్తాబు చేశారు. పట్టణంలోని పళ్లలో ఉన్న అనంతశయనస్వామి ఆలయం, సింగార్భేస్లోని మూలహనుమా న్ ఆలయం, బ్రాహ్మణవాడిలోని రామాలయం, శక్తిపీఠంలోని శ్రీరాముడి ఆలయం, సాయివిజయ కాలనీలోని ఆం జనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూలహనుమాన్ ఆలయంలో శ్రీరామ ప టాభిషేకం విగ్రహాల ఆవిష్కరణ, సీతారాముల కల్యాణం, అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు హనుమాన్ భక్తబృందం సభ్యులు తెలిపారు. శనివారం క ల్యాణ మహోత్సవానికి సంబంధించిన వాల్పోస్టర్లును ఆ లయాల కమిటీల సభ్యులు ఆవిష్కరించారు.
అదేవిధంగా అనంతశయన మందిరంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భా గంగా ప్రత్యేక పూజతోపాటు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఊట్కూర్ మండలకేంద్రంలోని పాతపేట హనుమాన్ ఆల యం, బిజ్వార్లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం, నర్వ మండలంలోని రామాలయం, మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం, కో స్గి పట్టణంలోని రామాలయం, హకీంపేట్, పోలేపల్లి, ముక్తిపాడ్, గుండుమా ల్ గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాలు, మద్దూర్ మండలకేంద్రంలో ని రామాలయం, మరికల్ ఆంజనేయస్వామి ఆలయం, చిత్తనూర్లోని రా మాలయం, కన్మనూర్, ఎలిగండ్ల, మాదారం, తీలేర్ హనుమాన్ ఆలయాలు, ధన్వాడ మండలకేంద్రంలో రామాల యం, కొండాపూర్లో శ్రీరాముడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆలయాల్లో శకటోత్సవం, రథోత్సవం, అగ్నిగుండం, నందికోలు వంటి అనేక భక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.