నాగర్కర్నూల్/వనపర్తి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రైతుల రుణమాఫీ కల నెరవేరుతున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హా మీ మేరకు రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో వేలాది మంది రైతుల కుటుంబాల్లో ఆనందం నింపుతున్నది. రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి చా టుకున్నారు. రైతుల కోసం నిరంతర విద్యుత్, పెం డింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, రైతు వేదికల నిర్మాణం, రుణమాఫీ వంటి ప థకాలన్నీ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.లక్షలోపు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేసేందుకు సీ ఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి విడుతలో రూ.25 వేలలోపు రుణాలు మాఫీ చేశారు. తాజాగా రూ.50 వేలలోపు రుణాలను మాఫీ చేస్తున్నా రు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జ మ అవుతున్నాయి. మొదటి రోజు రూ.25వేల నుంచి రూ.26 వేలు, రెండో రోజు రూ.26 వేల నుంచి రూ.27 వేలు ఇలా రోజుకు వేయి చొప్పున పెంచుతూ రుణమాఫీ అమలు కానున్నది.
ఇలా రూ.50వేల వర కు రుణాలున్న రైతులందరి ఖాతాల్లోనూ ప్రభుత్వం డ బ్బులు జమ చేస్తున్నది. 2018 డిసెంబర్ వరకు ఉన్న రైతుల వివరాలను వ్యవసాయ శాఖ సేకరించింది. దీని ఆధారంగా రుణమాఫీ రెండో విడుతను అమలు చేస్తున్నారు. కాగా, నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. రుణాలు తీసుకున్న రైతుల ఆధార్ను రేషన్ కా ర్డులతో అనుసంధానించి రుణమాఫీ ప్రక్రియ అమలు చేస్తున్నారు. సేద్యం కోసం తీసుకున్న అప్పులను తీర్చలేని రైతులకు ఇది వరంలా మారుతున్నది. రైతుబంధు తరహాలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బు లు జమ అవుతున్నాయి. రైతుల ఖాతాకు సెల్ఫోన్ మె సేజ్ల ద్వారా రుణమాఫీ డబ్బులు జమ అయిన సమాచారం చేరవేస్తున్నారు. మెసేజ్లు రాకున్నా ఏఈవోల ద్వారా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రుణమా ఫీ పూర్తయిన వెంటనే కొత్తగా రుణాలు అందనున్నా యి. దీనికిగానూ ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయగా రుణప్రణాళికను తయారు చేశారు. ఇం దులో వ్యవసాయం, రైతులకే అధిక రుణాలిచ్చేలా ప్రా ధాన్యత ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి రైతులకు బ్యాంకర్లు రుణాలిచ్చే ప్రక్రియ ప్రారంభం కానున్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 2,62,281 మంది రైతులు ఉండగా.. తొలి విడుతలో రూ.25వేల లోపు రుణాలు తీసుకున్న 9,568 మంది రుణమాఫీ ద్వారా లబ్ధి పొందారు. ప్రస్తుతం రెండో విడుతలో 26,803 మందికి గానూ రూ.93.82 కోట్లు నెలాఖరులోగా బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
వనపర్తి జిల్లాలో పంద్రాగస్టు రోజున వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చేతుల మీ దుగా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ.. సో మవారం నుంచి రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో రూ.25 వేల లోపు రుణాలను 5,916 మంది తీసుకున్నారు. రూ.50 వేల లోపు రు ణాలను 13,879 మంది రైతులు తీసుకోగా రూ. 47.92 కోట్లు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. రు ణమాఫీ చేసిన సీఎం కేసీఆర్కు, మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయా గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
ఖాతాల్లోకే రుణమాఫీ డబ్బులు..
రెండో విడుత రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమ అవుతాయి. నాగర్కర్నూ ల్ జిల్లాలో తొలి విడుతలో 9,568 మందికి రూ.25 వేలలోపు రుణమాఫీ అమలైంది. ఈసారి 26 వేల మందికి రూ.93 కోట్ల మేర లబ్ధి చేకూరనున్నది. ఈనెలాఖరులోగా రైతులందరికీ రెండో విడుత రుణమాఫీ అమలవుతుంది. డబ్బులు జమ అయిన వెంటనే సెల్ఫోన్లకు మెసేజ్ రూపంలో సమాచారం వస్తుంది. ఒకవేళ రాకున్నా ఏఈవోల ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.
వనపర్తిలో 13,879 మందికి లబ్ధి..
వనపర్తి జిల్లాలో 50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి. 13,879 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం రూ.47.92 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే చాలా మంది అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి.
సంతోషంగా ఉంది..
రైతులను ఆదుకుంటున్న దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. పెట్టుబడికి రైతుబంధు ఇస్తున్నడు. పింఛన్లు ఇస్తున్నడు. రుణమాఫీ పైసలు బ్యాంకులో పడ్డాయి. సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి సారోళ్లు చల్లగుండాలె. భూములకు నీళ్లు తెచ్చిండు. గతంలో ఎవ్వరూ రైతులను ఆదుకోలేదు. తెలంగాణ వచ్చాక అన్ని పనులు అవుతున్నయి.