జోగులాంబ గద్వాల : స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి జాతర) బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ఆవిష్కరించారు. త్వరలో మల్దకల్ మండల కేంద్రంలో జరుగబోయే బ్రహ్మోత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపకులు చైర్మన్ ప్రహ్లాద రావు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శేషంపల్లి నరసింహులు, అజయ్, శేఖర్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.