బాదేపల్లి మార్కెట్లో పత్తి అ‘ధర’హో..
క్వింటాకు ధర గరిష్ఠంగా రూ.10,009
అంతర్జాతీయంగా భారీ డిమాండ్
దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుదల
ఇంకా పెరగొచ్చంటున్న వ్యాపారులు
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
జడ్చర్ల, ఫిబ్రవరి 5 : తెల్ల బంగారం జిగేల్మంటున్నది. పత్తి ధర కొత్త రికార్డు సృష్టిస్తున్నది. శనివారం బాదేపల్లి మార్కెట్లో అత్యధిక ధర లభించింది. క్వింటాకు గరిష్ఠంగా రూ.10,009 పలికింది. ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో అంచనాలకు మించి ధర లభ్యమవుతున్నది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని వ్యాపారులు, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ప త్తికి అత్యధిక ధర లభించింది. శనివారం క్వింటాకు గరిష్ఠంగా రూ.10,009 ధర ప లికింది. మార్కెట్కు 342 బస్తాల పత్తి అ మ్మకానికి వచ్చింది. వానకాలంలో అధిక వర్షాలు కురవడంతో గుజరాత్, మహారా ష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటకతోపాటు ఏపీ, తెలంగాణలో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు తగ్గి డిమాండ్ పెరిగింది. దీనికితోడు సీజన్ పూర్తి కావస్తుండటం, మార్కెట్కు తగినంత పత్తి రాకపోవడం, ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాం డ్ అధికంగా ఉండటం వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు, మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరలు మ రింత పెరిగే అవకాశం ఉందన్నారు.
తగ్గిన వేరుశనగ ధరలు..
వేరుశనగకు పది రోజులుగా ధరలు తగ్గుతూనే ఉ న్నాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 18,323 బ స్తాల పల్లీ అమ్మకానికి రాగా గరిష్ఠంగా క్వింటాకు రూ. 6,510 ధర పలికింది. గతనెల 21న క్వింటాకు రూ. 7,560 ధర ఉండగా.. నేడు రూ.6,510కి పడిపోయిం ది. కనిష్ఠంగా రూ.3,001, మధ్యస్తంగా రూ.6,300 ధరలు వచ్చాయి. 15 రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యి వరకు ధర తగ్గింది. మార్కెట్కు అత్యధికంగా వేరుశనగ వస్తుండడం, ఎక్స్పోర్టు మార్కెట్లో ధరలు తక్కువగా ఉండడంతో ధర లు పడిపోతున్నాయని వ్యాపారులు తెలిపారు. అంతకుముందు రాయలసీమ, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల్లో విత్తనాలు విత్తే సమయం ఉన్నందున డి సెంబర్, జనవరి మొదటి వారం వ రకు పల్లీ విత్తనాలకు డిమాండ్ ఉన్నదన్నారు. ఆ సమయంలో అధిక ధ రలు వచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి శనివారం మార్కెట్కు భా రీ మొత్తంలో వేరుశనగ వచ్చింది. అ లాగే ధాన్యం, కంది, పెబ్బర్లు, మొ క్కజొన్న కూడా అమ్మకానికి వచ్చాయి. 23 బస్తాల ఆర్ఎన్ఆర్ ధాన్యంరాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.1,959, కంది 342 బస్తాలు రాగా గరిష్ఠంగా రూ.6,142, పెబ్బర్లు 2 బస్తాలు రాగా గరిష్ఠంగా రూ.5,910, మొక్కజొన్న 73 బస్తాలు రాగా గరిష్ఠంగా రూ.1,909, మినుములకు గరిష్ఠంగా రూ.4,389 ధర లభ్యమైంది.