శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
కనులపండువగా గ్రామోత్సవం
నేడు రావణ వాహనంపై దర్శనమివ్వనున్న స్వామిఅమ్మవార్లు
శ్రీశైలం, ఫిబ్రవరి 25: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వై భవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజు స్వా మిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. శుక్రవారం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, రుద్రపారాయణ, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంత్రం హోమం అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అలంకార మండపంలో పూజలు చేశారు. మంగళవాయిద్యాలు మధ్యన క్షేత్ర ప్రధాన వీధుల్లో మయూర వాహనంపై గ్రామోత్సవం జరిపించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగించారు. గ్రామోత్సవం అనంతరం కాళరాత్రిపూజ, మంత్రపుష్పంతోపాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ నిర్వహించారు. శనివారం భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లు రావణవాహనంపై విహరిస్తూ భక్తులకు గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారని ఈవో తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఈఈ మురళీబాలకృష్ణ, శ్రీనివాసరావు, హరిదాస్, ఫణీందర్ప్రసాద్, అనిల్కుమార్, శ్రీహరి, నర్సింహారెడ్డి, అయ్యన్న, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.